టాలీవుడ్ సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో కామ్నా జెఠ్మలానీ ఒకరు.తెలుగులో కామ్నా జెఠ్మలానీకి రణం, అల్లరి నరేష్ కు జోడీగా నటించిన సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయినా కామ్నా జెఠ్మలానీని అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.ప్రేమికులు సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
తాజాగా అలీతో సరదాగా షోకు హాజరైన కామ్నా జెఠ్మలానీ తాను ముంబైలో పుట్టి పెరిగానని చెప్పారు.సినిమాల్లోకి రాకముందు తాను మోడలింగ్ చేశానని మోడలింగ్ ద్వారా తాను సంపాదించిన తొలి పారితోషికం 300 రూపాయలు అని కామ్నా జెఠ్మలానీ పేర్కొన్నారు.యాడ్స్ ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల తనకు ప్రేమికులు మూవీలో ఆఫర్ దక్కిందని కామ్నా జెఠ్మలానీ చెప్పుకొచ్చారు.అమ్మ ప్రోత్సాహంతో ప్రేమికులు మూవీలో నటించానని కామ్నా తెలిపారు.
ఆ తర్వాత రణం మూవీలో తనకు ఛాన్స్ దక్కిందని కామ్నా జెఠ్మలానీ తెలిపారు.తాను ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నానని తనకు ఇద్దరు పిల్లలు అని ఆమె చెప్పుకొచ్చారు.
బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపును సంపాదించుకున్నానని కామ్నా జెఠ్మలానీ తెలిపారు.కత్తి కాంతారావు షూటింగ్ సమయంలో రఘుబాబు తనను ఆట పట్టించారని ఆమె చెప్పుకొచ్చారు.
అలసిపోయి కూర్చున్న తన వెనుక రఘుబాబు పదేపదే తుమ్మేవారని అలా చేయడంతో తనకు చాలా కోపం వచ్చిందని అయితే ఆ తర్వాత తాను తుమ్మలేదని స్ప్రే బాటిల్ ను చూపించారని అప్పటివరకు అందరూ ఎందుకు నవ్వుతున్నారో తనకు అప్పుడు అర్థమైందని కామ్నా జెఠ్మలానీ చెప్పుకొచ్చారు.పెళ్లి తరువాత కామ్నా జెఠ్మలానీ సినిమాలలో ఆఫర్లు వస్తున్నా ఎక్కువగా నటించడం లేదనే సంగతి తెలిసిందే.