టాలీవుడ్ ప్రేక్షకులు హీరోయిన్ కళ్యాణి అంటే ఠక్కున గుర్తుకు వచ్చే సినిమా ‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’.దర్శకుడు వంశీ డైరెక్ట్ చేసిన ఈ ఫీల్గుడ్ లవ్స్టోరీతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ ఆ తరువాత వరుస సినిమాలతో రెచ్చిపోయింది.
అయితే ఆ తరువాత పెళ్లి చేసుకుని సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ క్రమంలో సినిమాల్లో నుండి అదృశ్యం అయ్యింది.
కాగా ఇప్పుడు మళ్లీ ఆమె లైమ్లైట్లోకి రావాలని చూస్తుంది.
అయితే నటిగా కాకుండా దర్శకురాలిగా మారాలని కళ్యాణి ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని పనులను పూర్తి చేసుకున్న కళ్యాణి, తాజాగా దర్శకురాలిగా తన మొదటి సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను రిలీజ్ చేసింది.
కావేరీ కళ్యాణి డైరెక్టర్గా మారి చేతన్ చీను అనే హీరోను పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించబోతుంది.
ఇక్కడ మరో విశేషమేమిటింటే ఈ సినిమాను ఆమె నిర్మిస్తుండటం.
హోళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.మరి ఈ సినిమాతో ఆమె దర్శకురాలిగా తొలి సక్సెస్ను అందుకుంటుందో లేదో చూడాలి.