ఓ వివాహితను మంచానికి కట్టేసి యాసిడ్ పోసి తగలెట్టేశారంటున్న సీరియల్ నటి..

బుల్లితెరలో తెలుగు, తమిళం, కన్నడ, భాషల్లో ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో మెప్పించినటువంటి సీరియల్ నటి జ్యోతి రెడ్డి అందరికీ బాగానే గుర్తుంటుంది.  తెలుగులో ఈమె నటించినటువంటి పెళ్లి చేసుకుందాం, అష్టా చమ్మా, ఈశ్వరి, భార్యామణి, తదితర సీరియల్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

 Jyothi Reddy, Serial Actress, Tollywood, Kollywood, Women Painful Incidents-TeluguStop.com

తాజాగా జ్యోతి రెడ్డి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఇందులో భాగంగా దేశంలో మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాల గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

  ఇందుకు ఉదాహరణగా గతంలో ఒకసారి తన పుట్టింటికి వెళ్ళిన సమయంలో ఓ సంఘటన జరిగిందని ఆ సంఘటన తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని తెలిపింది.అయితే ఇంతకీ ఆ సంఘటన ఏమిటంటే గతంలో ఒకసారి తన తల్లిని చూసేందుకు తన ఇంటికి వెళ్లానని అయితే ఆ సమయంలో తనకు దూరపు చుట్టాలయినటువంటి ఓ వివాహితను ఆమె భర్త మంచానికి కాళ్లు, చేతులు కట్టేసి ఆమెపై యాసిడ్ పోశాడని దాంతో ఆమె మంచంతో సహా కాలిపోయిందని బాధితురాలిని చూడడానికి వెళ్లిన సమయంలో తనకు కన్నీళ్లు ఆగలేదని ఎమోషనల్ అయింది.

ప్రస్తుత సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే ఇలాంటి భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నామా అనిపిస్తుందని అన్నారు.అలాగే సినిమాల్లో మరియు బుల్లితెరలో చూపించేది ఇలాంటి పరిస్థితులు కూడా జరుగుతాయని అంతేగాని ఇలా చేయాలని ఉద్దేశపూర్వకంగా ఎవరూ చూపించరని కాబట్టి మనుషుల్లో మార్పు వచ్చేంత వరకు ఇలాంటి ఆగడాలు ఆగవని తెలిపారు.

అయితే ప్రస్తుతం టాలీవుడ్లో పలు సీరియళ్లలో నటిస్తున్నానని అంతేగాక ఇటీవల ఈ చిత్రానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నానని కూడా తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube