రేపు ఉదయం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న జీవిత మాట్లాడుతూ మన దేశం ప్రజాస్వామ్య దేశం అని ఇక్కడ ఎవరు ఎవరికైనా మద్దతు ఇవ్వవచ్చని చెప్పుకొచ్చారు.
ఎన్నికల సమయంలో న్యాయంగా, ధర్మంగా పోరాటం చేయాలని జీవిత కామెంట్లు చేశారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మన ఫ్యామిలీ అని జీవిత అన్నారు.
లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ఇక్కడ తాయిలాలు, బెదిరింపులు ఎందుకని జీవిత ప్రశ్నించారు.60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఓటు వెయ్యడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొందని జీవిత చెప్పుకొచ్చారు.ఓట్లు గుద్దించుకుని వెళతారని వాళ్లు భయాందోళనకు గురవుతున్నారని జీవిత కామెంట్లు చేశారు.శివబాలాజీ, రాజీవ్ కనకాల అంటే తనకు ఎంతో గౌరవమని అయితే వాళ్లు సైతం నిజాలు మాట్లాడటం లేదని జీవిత చెప్పుకొచ్చారు.
వాళ్లు మాట్లాడిన మాటలు తప్పని తాను ప్రూవ్ చేస్తానని అలా ప్రూవ్ చేస్తే మాత్రమే ఓటు వేసి గెలిపించాలని జీవిత పేర్కొన్నారు.మాది తప్పు అయితే నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టండి అంటూ జీవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.సైనికులలా ఓట్ల కొరకు పోరాటం చేయాలే తప్ప అన్యాయంగా కాదని జీవిత కామెంట్లు చేశారు.కళకు భాషాభేదాలు ఏమిటని ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కాకూడదా? అంటూ జీవిత ప్రశ్నించారు.
మోహన్ బాబు ఫ్యామిలీని చూస్తే తనకు జాలి వేస్తోందని సీనియర్ నరేష్ తవ్విన గుంతలో మోహన్ బాబు కుటుంబం పడిపోతుందని జీవిత కామెంట్లు చేశారు.నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విషయంలో చేసిన పనులు అన్నీ స్వార్థపూరిత పనులే అని జీవిత చెప్పుకొచ్చారు.ప్రకాష్ రాజ్ అధ్యక్షునిగా ఎంపికైతే నిజాయితీగా పని చేస్తారని జీవిత కామెంట్లు చేశారు.మంచి పనులు చేయాలనే ఆలోచనతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని జీవిత వెల్లడించారు.