ప్రముఖ నటి జయవాణి తాజాగా ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి, రమ్యకృష్ణ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మనిషి అన్న తర్వాత స్ట్రగుల్ ఉంటుందని సినిమా రంగంలో ఈ స్ట్రగుల్ ఎక్కువగా ఉంటుందని ఆమె అన్నారు.
సినిమా రంగంలోని వాళ్లకు ఒక సినిమా పూర్తైతే మరో సినిమా వెతుక్కోవాల్సి ఉంటుందని అయితే ఆర్టిస్ట్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంటుందని జయవాణి తెలిపారు.
ఎవరైతే స్ట్రగుల్ చేసి నిలదొక్కుకుంటారో వాళ్లు మాత్రమే నిలబడతారని జయవాణి అన్నారు.
తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో లేరని జయవాణి చెప్పుకొచ్చారు.నేను హార్డ్ వర్క్ చేసి ఉంటే మరింత మంచి పొజిషన్ లో ఉండేదానినని జయవాణి తెలిపారు.
సినిమాలపరంగా నాకు దక్కిన పాత్రలతో సంతృప్తి ఉందని ఆమె వెల్లడించారు.సపోర్ట్ ఉంటే మరిన్ని ఎక్కువ ఆఫర్లు వచ్చేవని ఆమె తెలిపారు.
ఒక విధంగా తాను లక్కీ అని తాను ఎవరినీ అడగకపోయినా తనకు ఆఫర్లు ఇస్తున్నారని జయవాణి అన్నారు.
తమ్మారెడ్డి సినిమాలో తాను చేశానని జయవాణి తెలిపారు.హీరోయిన్ గా కెరీర్ ఎక్కువకాలం ఉండదనే భావన తనలో ఉండేదని ఆమె అన్నారు.ఒక డైరెక్టర్ సినిమాలో రోల్ అని చెప్పి ఫోటో షూట్ కు పిలిచి లంబాడీ టైప్ డ్రెస్ లో ఫోటోలు తీశారని జయవాణి చెప్పుకొచ్చారు.
అయితే ఆ సినిమా ఏమైందో తెలియదని తన ఫోటోలు మాత్రం వెబ్ సైట్లలో లీక్ అయ్యాయని జయవాణి కామెంట్లు చేశారు.ఆ ఫోటోలను ఎలా తొలగించాలో తనకు తెలియదని జయవాణి అన్నారు.కెమెరా ముందు నేను చెలరేగిపోతానని అనడం కరెక్ట్ కాదని దానిని విడిగా చేయమంటే తాను చేయలేనని జయవాణి అన్నారు.తనలా రమ్యకృష్ణగారు కూడా కెమెరా ముందు ఉన్నట్టు రియల్ లైఫ్ లో ఉండరని ఆవిడ చాలా సాఫ్ట్ గా ఉంటారని జయవాణి చెప్పుకొచ్చారు.