ఇండస్ట్రీలో కొంతమంది నటీమణులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా ఆయా సినిమాలతో విజయాలను అందుకోవడంతో పాటు ప్రశంసలను సొంతం చేసుకుంటారు.అలా పాపులారిటీని సొంతం చేసుకున్న నటీమణులలో నటి జయవాణి ఒకరు.
ఒక ఇంటర్వ్యూలో జయవాణి మాట్లాడుతూ నాకు ఏదైనా ఇష్టం లేకపోతే నా ఫేస్ లోనే తెలిసిపోతుందని ఆమె తెలిపారు.మేకప్ లేకుండా తనను చాలామంది గుర్తుపట్టరని జయవాణి అన్నారు.
బాబీ సినిమా సమయంలో ట్రైన్ లో మేనేజర్ అందరూ వచ్చారా అని చూసుకుంటూ స్పీడ్ గా అటూఇటూ తిరుగుతున్నారని తాను అక్కడే ఉన్నా తనకోసం వెతికారని జయవాణి తెలిపారు.పాత్రకు తగిన విధంగా తాను మేకప్ వేసుకుంటానని జయవాణి అన్నారు.
పాత్ర గెటప్ ను బట్టి తాను ట్రయల్ వేస్తానని జయవాణి చెప్పుకొచ్చారు.సినిమా రంగాన్ని ఎంచుకోవడం వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని ఆమె తెలిపారు.
తన సిస్టర్ అమెరికాలో ఉన్నారని జయవాణి అన్నారు.ఈ రంగాన్ని ఎంచుకోవడం వల్ల వెల్ సెటిల్ కాలేదని జయవాణి చెప్పుకొచ్చారు.ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నాన్నగారు చనిపోయారని తాను అదే సమయంలో ఈసీ మెంబర్ గా పోటీ చేశానని.విష్ణు గెలవాలని మోహన్ బాబు మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల సమయంలో చాలా తాపత్రయపడ్డారని జయవాణి అన్నారు.
నాన్నతో తనకు చాలా అటాచ్ మెంట్ అని జయవాణి ఎమోషనల్ అయ్యారు.
విష్ణు ప్యానల్ నుంచి క్యాంపెయిన్ లో ఉన్న సమయంలో నాన్న చనిపోయారని కాల్ వచ్చిందని జయవాణి అన్నారు.అక్టోబర్ 10వ తేదీన నా పుట్టినరోజు కాగా మోహన్ బాబు గారు చీరను బహుమతిగా పంపారని జయవాణి చెప్పుకొచ్చారు.ఆయన తనకు బ్లెస్సింగ్స్ ఇచ్చారని జయవాణి వెల్లడించారు.
జయవాణి చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.