పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు జయలలిత.సినిమాలతో పాటు పలు సీరియళ్లలో కూడా నటించిన జయలలిత తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా షోకు మరో నటి వరలక్ష్మితో కలిసి గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ షో ప్రోమోలో జయలలిత తన సినీ కెరీర్ గురించి, బీ గ్రేడ్ సినిమాల్లో నటించడం గురించి, ఇతర విషయాల గురించి చెప్పుకొచ్చారు.
దంచవే మేనత్త కూతురా రీమిక్స్ పాటతో షోలోకి జయలలిత ఎంట్రీ ఇచ్చారు.
తనకు అప్పట్లో పుంఖానుపుంఖానుగా ఉత్తరాలు వచ్చేవని.ఆ లెటర్స్ ను చూసి నాన్న ఎవరు రాశారని అడిగితే ఎవరో నాకు తెలీదని చెప్పేదానినని ఆమె పేర్కొన్నారు.
నీకు తెలీకుండా ఎలా ఉత్తరాలు రాస్తారని నాన్న ఒకటి పీకేవారని జయలలిత తెలిపారు.అలీ మీ నాన్నగారు ఒక డైరెక్టర్ ను పరిచయం చేస్తారని తీసుకెళితే మీకు కాకుండా నాన్నగారికి క్యారెక్టర్ ఇచ్చారట కదా అని అడగగా ఆ డైరెక్టర్ ఎవరో కాదని వంశీగారని జయలలిత చెప్పారు.
క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న తాను సినిమా అవకాశాల కోసం ఫ్యామిలీతో పాటు వచ్చానని.మళ్లీ వెనక్కు వెళ్లిపోతే బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ అసహ్యం అయిపోతామని అనిపించిందని ఆమె అన్నారు.ఐటెం సాంగ్స్, వ్యాంప్ క్యారెక్టర్స్ సూట్ కావని తాను భావిస్తానని కానీ జనాలు మాత్రం వాటినే చూశారని ఆమె అన్నారు.తను డబ్బు విషయంలో మోసపోవడం గురించి స్పందిస్తూ వాళ్లు విజయనగరం రాజులని జీఎస్టీలు కట్టలేకపోతున్నామని సీరియల్స్ చేయడం కష్టంగా ఉందని చెప్పగా నా దగ్గర ఉన్న డబ్బుతో సీరియల్స్ చేయమని డబ్బులు ఇచ్చానని 2018 డిసెంబర్ నాటికి 4 కోట్ల రూపాయల వరకు ఇచ్చానని ఆమె అన్నారు.
ఆ తరువాత డబ్బులు తీసుకున్న వాళ్లు చేతులెత్తేశారని.ఇప్పుడు నేను సొంతంగా కారు లేక క్యాబ్ లో తిరుగుతున్నానని జయలలిత అన్నారు.
అంత నమ్మి ఎలా మోసపోయానంటూ నాపై నాకే అసహ్యం వేస్తుందని జయలలిత తెలిపారు.