రియల్ హీరో సోనూసూద్ కు దేశంలో రోజురోజుకు పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.పంజాబ్ లోని చిన్న గ్రామానికి చెందిన సోనూసూద్ దేశంలోని పలు గ్రామాలకు తాజాగా డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ లను పంపడానికి సిద్ధమయ్యారు.
కరోనాతో చనిపోయిన వారి బంధువులకు చివరి చూపు అయినా దక్కాలనే ఉద్దేశంతో సోనూసూద్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.సోనూసూద్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
20 కంటే ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్లను సోనూసూద్ త్వరలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు.ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటే మంచి మనస్సు ఉంటే చాలని సోనూసూద్ చెబుతున్నారు.
మనచుట్టూ చాలామంది మంచివాళ్లు ఉన్నారని కంటిచూపు లేని అమ్మాయి, హ్యాండీకాప్డ్ పర్సన్ కూడా తన ఫౌండేషన్ కు విరాళాలు ఇచ్చారని సోనూసూద్ చెబుతున్నారు.అయితే సోనూసూద్ చేస్తున్న మంచి పనుల వల్ల కొందరు సెలబ్రిటీలు సోనూసూద్ ఏకంగా పీఎం కావాలని కోరుకుంటున్నారు.
స్టార్ హీరోయిన్ హ్యూమా ఖురేషి సోనూసూద్ కు పీఎం అయ్యే అర్హత ఉందని తెలిపారు.సోనూసూద్ చేతికి అలాంటి పదవి వస్తే ఆ పదవి ద్వారా సోనూసూద్ ఎన్నో మంచి పనులు చేయగలరని హ్యూమా ఖురేషి పేర్కొన్నారు.సోనూసూద్ ఎన్నికల్లో పోటీ చేస్తే తాను అతనికే ఓటు వేస్తానని ఆమె తెలిపారు.అయితే సోనూసూద్ మాత్రం ప్రస్తుతానికి తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానో లేదో చెప్పలేనని సోనూసూద్ అన్నారు.
రాజకీయాల్లోకి సోనూసూద్ ఎంట్రీ ఇస్తే మాత్రం భారీ మెజారిటీతో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి.సినిమాల్లో స్టార్ విలన్ గా సత్తా చాటుతున్న సోనూసూద్ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆయన అభిమానులు కోరుకుంటూ ఉండటం గమనార్హం.సోనూసూద్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఏ పార్టీతో ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.