టాలీవుడ్ లో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, ఫిదా, జంధ్యాల రాసిన ప్రేమ కథ, ఐస్ క్రీమ్ 2, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించినటువంటి గాయత్రీ గుప్త గురించి తెలియని వారుండరు.అయితే ఈమె సినిమాల్లో అవకాశాలు లేక అప్పుడప్పుడు పలు రకాల ఈవెంట్లు, షోలలో సందడి చేస్తూ తన అభిమానులకి అందుబాటులో ఉంటుంది.
అయితే తాజాగా గాయత్రి గుప్తా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా తన సినీ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి గాయత్రీ గుప్తా తన ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ఇందులో భాగంగా సినీ పరిశ్రమ ఏదైనా సరే క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉంటుందని దానిని చాకచక్యంగా ఎదుర్కొని ముందుకు వెళితే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.అయితే టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ సమస్య ఉందని కాకపోతే శ్రీ రెడ్డి హంగామా చేసినంత పెద్ద సమస్య ఏమీ లేదని అన్నారు.
మామూలుగా అవకాశాల కోసం కొందరు దర్శక నిర్మాతలకి కమిట్మెంట్ ఇస్తున్నారని, ఇందులో ఇద్దరూ ఇష్టపడడం వల్లనే ఈ కమిట్మెంట్ అవుతుందని అన్నారు.ఒకవేళ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పటం వలన ఎవరికీ నష్టం ఉండదని అంటోంది ఈ అమ్మడు.
అయితే సరిగ్గా శ్రీ రెడ్డి విషయంలో కూడా ఇలాగే జరిగిందని అవకాశాలు కోసం కమిట్మెంట్ ఇచ్చి తర్వాత తనని తనను మోసం చేశాడంటూ మీడియా ముందుకు రావడం కరెక్ట్ కాదని అన్నారు.ఒకవేళ ఇష్టం లేకపోతే అప్పుడే నో చెప్పి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదని కూడా అన్నారు.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో వెబ్ సీరిస్ లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే సినీ పరిశ్రమలో తనతో సన్నిహితంగా ఉంటున్నటువంటి దర్శకుడితో ఈ వెబ్ సిరీస్ కథనంపై చర్చలు జరిగినట్లు కూడా సమాచారం.ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ నటి నటులు కూడా ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వెబ్ సిరీస్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు.