బాలీవుడ్ ప్రముఖ స్టార్లలో
షారుక్ ఖాన్
ఒకరు.షారుఖ్ ఖాన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తులలో ఇతను కూడా ఒకరు.
అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ షారుక్ ఖాన్ కు ఒక రేంజ్ లో పాపులర్ ఉన్న సంగతి మనకు తెలిసినదే.ఈ మధ్యకాలంలో షారుక్ ఖాన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.2018లో షారుక్ ఖాన్ నటించిన జీరో చిత్రం తర్వాత మరి కొత్త చిత్రాలు ఏమీ చేయకపోవడంతో అభిమానుల్లో నిరాశ మొదలైంది.
తను ఎంతగానో అభిమానించే నటుడు కొత్త సినిమా గురించి ఎప్పుడు టాక్ వినిపిస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ తరహాలోనే దంగల్ ఫేం బ్యూటీ ఫాతిమా సనా షేక్ కూడా షారుక్ ఖాన్ అభిమానులలో ఒకరనీ తెలిసింది.తన అంటే ఎంతో ఇష్టమని, తను నటించే ఏ సినిమా ని కూడా వదలకుండా చూస్తానని ఆమె పేర్కొన్నారు.
ఈ మధ్యకాలంలో షారుక్ ఖాన్ సినిమాలు ఏమీ లేకపోవడంతో కొంతమేర ఈ భామ కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తోంది.
త్రీ ఇడియట్స్, పీకే, సంజు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తను కొత్తగా నిర్మించబోయే చిత్రంలో షారుక్ ఖాన్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న నటి ఫాతిమా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కి షారుక్ ఖాన్ తో తీయబోయే చిత్రంలో తనకు నటించే అవకాశం ఇవ్వాలంటూ డైరెక్టర్ కి మెసేజ్ పంపించినట్లు సమాచారం.
మేకర్స్ కు వారి మధ్య ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేయడానికి అప్పుడప్పుడు ఇలాంటి మెసేజ్ లను పంపుతుంటా అని ఫాతిమా ఈ సందర్భంగా తెలియజేశారు.
అయితే ప్రస్తుతం తాను దిల్జీత్, దోసాంజ్, మనోజ్ భాజ్పేయితో కలిసి సూరజ్ పే మంగళ్ భరి చిత్రాల్లో నటిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.షారుక్ ఖాన్ అంటే ఇంతటి అభిమానం పెంచుకున్న ఫాతిమా కి డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ షారుక్ పక్కన నటించే అవకాశం ఇస్తాడో? లేదో? వేచి చూడాల్సిందే.