ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే కుర్రాళ్లలో కనిపించే జోష్ అంతా ఇంతా కాదు.చదువులు పక్కన పెట్టి, షికార్లు కాదనుకుని టీవీలకు అతుక్కుపోతుంటుంది కుర్రకారు.
కుర్రోళ్లు కదా.వాళ్ల సరదాలు ఎలా కాదనగలం.వాళ్ల ఆనందాన్ని ఎలా తప్పు పట్టగలం.ఆల్రెడీ ఐపీఎల్ కోసం తమ ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు.ఐపీఎల్ని ప్రత్యేకంగా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.సో కుర్రాళ్ల ఎంటర్టైన్మెంట్కి లోటేమీ లేదన్న మాట.అయితే ఇక్కడే ఓ పెద్ద చిక్కుంది.ఐపీఎల్ అంటే ఎంటర్టైనింగ్ క్రికెట్ హంగామా మాత్రమే కాదనీ, అదొక వదిలించుకోలేని జాడ్యమనీ చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి.
తమకు ఇష్టమైన టీమ్ ఓడిపోతే భరించలేదురు.ఇంకొందరైతే సహించలేరు.
అందులోనూ మన తెలుగు వాళ్లు అస్సలు తట్టుకోలేరు.ఇటువంటి తరుణంలో ఆదివారం ఐపీఎల్ మ్యాచుల్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి.
అయితే ఈ మ్యాచ్ టైగా మారింది.దీంతో హైదరాబాద్ సన్ రైజర్స్ అభిమానులకు మాత్రం ఉత్కంఠతో పాటు తీవ్రంగా నిరాశ ఎదురయ్యిందనే చెప్పాలి.
ప్రతి సీజన్లో కూడా హైదరాబాద్ జట్టు అభిమానులకు నిరాశనే కలిగిస్తోంది.ప్రతి మ్యాచ్ కూడా గెలిచే దశలో చేజేతులారా వదిలేస్తున్నారు.
దీంతో ఫ్యాన్స్ అందరూ ఫైర్ అవుతున్నారు.
టైగా అయ్యిన తర్వాత మ్యాచ్ లో సూపర్ ఓవర్ ను నిర్ణయించారు.
సూపర్ ఓవర్ కూడా రసవత్తరంగా సాగింది.హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు గెలుస్తుందని చాలా మంది అనుకున్నారు.
అయితే సూపర్ ఓవర్ లో హైదరాబాద్ కు వార్నర్, విలియమ్సన్ లు బ్యాటింగ్ చేశారు.అన్ని మ్యాచుల్లో వార్నర్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోవడం అభిమానులకు నిరాశనే కలిగించింది.
మళ్లీ సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేసేందుకు రావడం ఏంటీ అని చాలా మంది వార్నర్ ను తిట్టిపోస్తున్నారు.ఈ నేపథ్యంలో తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
వార్నర్ సరిగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే హైదరాబాద్ జట్టు గెలిచి ఉండేది.హీరోయిన్ ఈషా రెబ్బ ట్వీట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసింది.
వార్నర్ అన్న ఏంటి ఇది, నువ్వు ఎందుకు వచ్చావు.బెయిన్ స్టో లేదా సుచిత్ ను పంపి ఉండవచ్చు.
నీకు టీమ్ ను నిర్మించుకోవాలనుకుంటే డ్రీమ్ 11 లో నిర్మించుకో అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.ఈషా రెబ్బ ట్వీట్ కు చాలా మంది రెస్పాండ్ అయ్యారు.
వార్నర్ పై నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.ఇకనైనా వార్నర్ మారాలంటూ కామెంట్లు పెడుతున్నారు.