దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకు పడుతుంది.అంతేకాకుండా రోజురోజుకి అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
ఈ తరుణంలో ఒక సీరియల్ హీరోయిన్ తల్లికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది.దీనితో ఆమె ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సహాయం చేయాలని కోరడం జరిగింది.
ఇక ఈ విషయం మీద పూర్తి వివరాల్లోకి వెళితే… దియా ఔర్ బాటి హమ్ సీరియల్లో కీలక పాత్ర పోషిస్తున్న దీపికా సింగ్ తల్లికి కరోనా పాజిటివ్ గా వైద్యాధికారులు నిర్ధారణ చేశారు.
ఇక దింతో ఆ హీరోయిన్ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉండడంతో ఆమె సీఎం క్రేజీ వాల్ సహాయం చేయాలని కోరడం జరిగింది.
అలాగే ఈ విషయానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది.ఇక అందులో మాది ఉమ్మడి కుటుంబం… మా ఇంట్లో 45 మందిమి ఉంటామని తెలిపారు.
ఇక 55 సంవత్సరాలు ఉన్న తన తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో పరీక్షలు నిర్విహించిన తర్వాత తెలిసిందని, అయితే రిపోర్ట్ అందచేయలేదు… అలాగే తన తల్లికి కరోనా చికిత్స అందజేయాలంటూ దీపిక సింగ్ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిని సీఎం క్రేజీ వాల్ ని కోరడం జరిగింది.
ఇకపోతే తన తల్లి ఎప్పుడు బయటికి వెళ్లలేదు కానీ… ఆమెకు ఎలా వైరస్ వచ్చిందో అర్థం కాలేదని ఆమె తెలియజేసింది.
అంతే కాకుండా ఇంట్లో వారి అందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహించి… మా కుటుంబాన్ని రక్షించాలని ఆమె సీఎం కి మానవి చేసుకుంది.