బీజేపీ లో నటి,మాండ్యా ఎంపీ సుమలత చేరుతారు అంటూ గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ పార్టీ కి షాకిస్తూ బీజేపీ పార్టీ లో చేరడం లేదని తేల్చి చెప్పారు.
ఈ సారి జరిగిన ఎన్నికల్లో సుమలత మాండ్యా నుంచి పోటీ పడిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో సుమలత కు బీజేపీ సహకారం అందించింది అని,త్వరలో ఆమె బీజేపీ లో చేరుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఆ వ్యాఖ్యలను ఖండించారు.
బీజేపీ కి షాకిస్తూ ఆ పార్టీ లో చేరేది లేదని ఆమె తేల్చి చెప్పేశారు.స్వతంత్ర ఎంపీగా కొనసాగుతానని స్పష్టం చేశారు.
లోక్సభ ఎన్నికల్లో JDSతో చేతులు కలపకుండా పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ మరిన్ని స్థానాలు గెలిచి ఉండేదన్నారు.JDSతో పొత్తు చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసిందని,కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే కనీసం 10 లోక్సభ నియోజకవర్గాల్లో గెలిచి ఉండేదని ఆమె అన్నారు.కర్ణాటకలో BJPకి అత్యధిక స్థానాలు రావడంపై స్పందించిన సుమలత, ప్రజాబలంతో బీజేపీ గెలిచినట్లుగా తాను భావించడం లేదన్నారు.