హిజబ్ వివాదం మొదటగా కర్ణాటకలో ఒక ప్రభుత్వ కళాశాలలో చోటు చేసుకుంది.హిజాబ్ ధరించడం నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది.
దీనిపై ఎనిమిది మంది ముస్లిమ్ విద్యార్థినిలు నిరసన వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే.ఇక ఈ వివాదం గురించి ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వారి వాదనలను వినిపించారు.
ఈ హిజాబ్ అంటే తెర ఇది జుట్టును పూర్తిగా కప్పి ఉంచుతుంది.ముస్లిమ్ మహిళలలు తల, మెడ భాగాలను కప్పి ఉంచడం కోసం ఉపయోగించే ఈ వస్త్రాన్ని హిజబ్ అంటారు.
ఇది ముస్లిమ్ మహిళలకు వారి ఆచారంగా వస్తుందని ముస్లిం మహిళలు తెలిపారు.కానీ ఇంకా ఈ వివాదం కోర్టులోనే కోనసాగుతుందన్న విషయం అందరికీ తెలిసినదే.
ఈ వివాదం మీద ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను తెలిపారు.తాజాగా నటి స్వర భాస్కర్ సైతం ఈ వివాదం మీద ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఈ ట్వీట్ లో స్వర భాస్కర్ మహా భారతంలో ద్రౌపదికి జరిగిన వస్త్రాపహరణం లాంటిదే ఈ సంఘటన అని ట్వీట్ చేశారు.
దాంతో ఈ ట్వీట్ నచ్చని కొంత మంది నెటిజన్లు స్వర భాస్కర్ ని ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు.ద్రౌపతి వస్త్రాపహరణం గురించి మాట్లాడే ముందు మహాభారతం లాంటి గొప్ప గ్రంధాన్ని చదవాలని దాని తర్వాతే ట్వీట్ చేయాలని నెటిజన్లు స్వరభాస్కర్ మీద మండి పోతున్నారు.ఏదిఏమైనా ఈ వివాదాన్ని ద్రౌపతి వస్త్రాపహరణంతో పోల్చడం వల్ల ఈ నటికి నెటిజన్ల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
ఏదిఏమైనా ఇప్పటికే ఈ వివాదం గురించి ఎంతో మంది హీరోయిన్లు వారి అభిప్రాయాలను తెలుపుతూ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.