‘ఖుషి’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ భూమిక గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.ఈమె హీరోయిన్గా నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపక పోవడంతో ఈమె క్రేజ్ దక్కింది.
దాంతో ఈమె సినిమాలకు దూరంగా ఉటుంది.ఇటీవలే దుబాయ్లో జరిగిన సైమా అవార్డు వేడుకలో కనిపించిన భూమిక రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
హీరోయిన్గా స్టార్ హోదాను దక్కించుకున్న భూమికకు ఇప్పటికి కూడా హీరోయిన్గానే నటించాలనే యావ లేదట.తనకు తగ్గ క్యారెక్టర్స్ ఏం వచ్చినా చేసేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ సన్నిహిత దర్శక నిర్మాతల వద్ద చెబుతోందట.
స్టార్ హీరోలకు అక్కగా, అమ్మగా, అత్తగా సైతం నటించేందుకు తాను సిద్దంగా ఉన్నాను అంటూ ఈ అమ్మడు ప్రకటించింది.యువ హీరోలకు అక్కగా బాగా సూట్ అయ్యే పీచర్స్ ఉన్న భూమికకు ఏ ఫిల్మ్ మేకర్ రీ ఎంట్రీ అవకాశం ఇస్తాడో చూడాలి.