తెలుగు సినీ నటి అను ఇమాన్యుల్.తెలుగు, మలయాళ, తమిళ సినిమాల్లో నటించి ఈ అమ్మడు తొలిసారిగా బాలనటిగా సినీ పరిశ్రమకు పరిచయం అయింది.
ఇక ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలో తన నటనతో మంచి గుర్తింపు అందుకోగా మలయాళ సినిమాలకు దూరంగా ఉంటూ తెలుగు సినిమాలలో వరుస ఆఫర్ లను అందుకుంటుంది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఎప్పటికప్పుడు ఫోటోల షేర్ల తో బిజీగా ఉంటుంది.
2011 లో స్వప్న సంచారి అనే మలయాళి సినిమాలో బాలనటిగా నటించింది.ఆ తర్వాత యక్షన్ హీరో బిజు అనే సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది.
ఇక 2016లో మజ్ను అనే ఈ సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది.ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అను అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహా సముద్రం సినిమాలో నటిస్తుంది.ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ లు హీరోలుగా నటిస్తున్నారు.
మరో బాలీవుడ్ నటి అదితీ రావు హైదరి కూడా ఈ సినిమాలో నటిస్తుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అందులో అను ఇమ్మాన్యూల్ సముద్రం ఒడ్డున క్యాప్ ధరించుకొని వైట్ కలర్ డ్రెస్ లో ఫోటోకు ఫోజు ఇచ్చింది.ఇక అక్కడ సముద్ర అందాలతో తన అందాలను చూపిస్తూ యువతను బాగా ఆకట్టుకుంది.
అంతేకాకుండా తన గ్లామర్ కేంద్రం మరింత హాట్ గా మారగా హాట్ లుక్ లతో తెగ పిచ్చెక్కిస్తుంది.