తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా పాపులర్ అయిన సెలబ్రిటీలలో ఐశ్వర్య రాజేష్ ఒకరనే సంగతి తెలిసిందే.జీవితం చాలా నేర్పిందంటూ ఐశ్వర్య రాజేష్ తనకు ఎదురైన అనుభవాలకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బాల్యంలో తాను చాలా కష్టాలను ఎదుర్కొన్నానని ఆమె చెప్పుకొచ్చారు.ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే తాను తండ్రిని కోల్పోయానని ఆమె కామెంట్లు చేశారు.
రోడ్డు ప్రమాదంలో నా ఇద్దరు సోదరులు దుర్మరణం పాలయ్యారని ఐశ్వర్య రాజేష్ వెల్లడించారు.లైఫ్ నాకు ఎన్నో పాఠాలను నేర్పిందని ఆమె కామెంట్లు చేశారు.తాను సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.స్టార్ హీరోయిన్ గా పేరు రాకపోయినా పరవాలేదని మంచి నటిగా పేరు వస్తే చాలని ఐశ్వర్య రాజేశ్ అన్నారు.
తాను నటించిన సినిమాలు పది కాలాల పాటు నిలిచిపోయే చాలనేది నా ఆశ అని ఆమె కామెంట్లు చేశారు.మాది తమిళనాడు రాష్ట్రంలో స్థిరపడిన తెలుగు కుటుంబం అని ఆమె చెప్పుకొచ్చారు.
చిన్నచిన్న రోల్స్ తోనే ఐశ్వర్యా రాజేష్ కెరీర్ మొదలైంది.అయితే ఆ పాత్రలకు మంచి పేరు రావడంతో పాటు ఆమెకు సినిమా ఆఫర్లు పెరిగాయి.
కాక్కా ముట్టై సినిమా సక్సెస్ సాధించడంతో ఓవర్ నైట్ లో ఆమె రేంజ్ మారిపోయింది.
కాక్కా ముట్టై సినిమాలో ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో కనిపించి ఆమె మెప్పించారు.ఆ తర్వాత ఐశ్వర్య రాజేష్ కు వరుసగా హీరోయిన్ ఆఫర్లు దక్కాయి.ప్రస్తుతం తమిళంలో అరడజను సినిమాలలో నటిస్తూ ఈమె బిజీగా ఉన్నారు.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సైతం ఐశ్వర్య రాజేష్ విజయాలను అందుకుంటున్నారు.ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.