నటి ఆమని తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.అయితే నటిగా తాము నటించే పాత్రలో పరకాయ ప్రవేశం చేసినప్పుడే వారు నటించే పాత్రకు ప్రాణం పోసినట్టు అవుతుంది.
అయితే ఇలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటించే నటీ నటులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు.అయితే అటువంటి కొద్ది మంది నటీ నటుల్లో అలనాటి హీరోయిన్ ఆమని ఒకరు.
ఆ నలుగురు, శుభలగ్నం సినిమాలలో కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హీరోయిన్ గా కొన్ని కాలాల పాటు గుర్తుంచుకునే సినిమాలు చేసిన ఆమని, తరువాత హీరోయిన్ తరహా పాత్రలకు గుడ్ బై చెప్పి యంగ్ జనరేషన్ హీరోల సినిమాలలో అమ్మ పాత్రలలో ఎక్కువగా నటించేందుకు ఆమని ఆసక్తి చూపిస్తోంది.అయితే ప్రస్తుతం శ్రీకారం సినిమాలో శర్వానంద్ కు తల్లి పాత్రలో ఆమని నటించింది.
అయితే అమ్మ పాత్రలలో ఉండే సాధారణ కోణాన్ని కాకుండా అందులోనూ మాస్ పాత్రలో నటిస్తోంది.మాస్ పాత్ర అంటే ఆశామాషీ కాదు.చేతిలో మందు సీసాతో బూతులు వచ్చేటటువంటి పాత్రలో కార్తికేయ సినిమా చావు కబురు చల్లగాలో నటిస్తోంది.అయితే ప్రస్తుతం ఆ మాస్ పాత్రకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఫోటోలతోనే ఆమని అభిమానులను ఆసక్తికి గురి చేస్తున్న ఈ పాత్రలో ఆమని నట విశ్వరూపం చూడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.