‘జంబలకిడిపంబ’తో తెలుగుతెరకు పరిచయమై, ‘శుభలగ్నం’లో ‘ఏమిటో…’ డైలాగుతో అందర్నీ ఆకట్టుకున్న ఆమని ఎన్నో మంచి పాత్రలు పోషించి తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకుంది.కమర్షియల్ దర్శకులతో పాటు కళాత్మక దర్శకులైన బాపు, కె.
విశ్వనాథ్లతో కూడా పనిచేసే అదృష్టం ఆమెకు దక్కింది.కెరీర్ పీక్లో ఉన్నప్పుడే హఠాత్తుగా ప్రేమపెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఆమని ఆ తర్వాత ‘ఆ నలుగురు’తో రీ ఎంట్రీ ఇచ్చారు.
ఇప్పుడు ఆమె తన నట వారసురాలిగా తన మేనకోడలని సినీ రంగ ప్రవేశం చేయించనున్నారు.
ఆమని మేన కోడలు హృతిక.అయితే ఈ అమ్మడు తెరంగ్రేటం చేస్తుంది తెలుగు సినిమా ద్వారా కాదు… ఓ తమిళ చిత్రం ద్వారా ఆమె తెరంగ్రేటం చేయబోతున్నారు.సక్సెస్ కలిసొస్తే భవిష్యత్తులో తెలుగులో కూడా నటిస్తుందేమో? మా అత్తయ్య ఆమని తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మా మామయ్య ఖాజామొయిద్దీన్ సినీ నిర్మాతగా రాణిస్తున్నారు.వారి ఆశీస్సులతో నేను సినిమాల్లోకి వచ్చినట్లు హృతిక వెల్లడించారు.
చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్నాను.సినిమా డ్యాన్స్లలో కూడా శిక్షణ పొందాను.చిన్నప్పటి నుంచి మా అత్తయ్యలా నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక.మా తల్లిదండ్రులకు ఈ విషయం చెబితే ముందు చదువు పూర్తి చేసి తర్వాత నటిగా మారమని సలహా ఇచ్చారు.
నా మొదటి చిత్రం తర్వాత మంచి మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది.అత్తయ్య కన్నా ఎక్కువ చిత్రాలలో నటించి, ఆమె కన్నా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం.ఆ దిశగా నేను ఎంతో కష్టపడుతున్నానని చెప్పుకొచ్చింది.మురుగన్ దర్శకత్వంలో ‘విడియాద ఇరవొండ్రు వేండుం’ అనే చిత్రం ద్వారా హృతిక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు.