తెలుగు, తమిళ భాషల్లో సినిమాల్లో నటించి నటుడిగా విశాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని విశాల్ తాజాగా ఒక స్కూల్ ను మూసేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ స్కూల్స్ లో ఒకటైన పద్మశేషాద్రి బాల భవన్ లో రాజగోపాల్ అనే వ్యక్తి ఉపాధ్యాయునిగా విధులను నిర్వహిస్తున్నారు.
రాజగోపాల్ కామర్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తుండగా ఒక స్టూడెంట్ రాజగోపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒక స్టూడెంట్ ఆరోపణలు చేశారు.
ఆ తరువాత ఆ స్కూల్ లో చదివిన మరి కొందరు స్టూడెంట్స్ రాజగోపాల్ విషయంలో ఇదే తరహా ఆరోపణలు చేయడంతో విశాల్ ఆ టీచర్ పై, ఆ స్కూల్ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.ఈ స్కూల్ ఆరోపణల విషయంలో కులం ప్రస్తావన తెచ్చి వివాదాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విశాల్ తెలిపారు.
విశాల్ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఏకంగా స్కూల్ ను మూసేయాలని డిమాండ్ చేయడం గమనార్హం.విద్యార్థినులకు ఇప్పటివరకు స్కూల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పలేదని విశాల్ పేర్కొన్నారు.ఇలాంటి ఘటనల విషయంలో సీరియస్ గా స్పందించి చర్యలు తీసుకోవాలని విశాల్ ఏకంగా విద్యాశాఖ మంత్రిని కోరడం గమనార్హం.బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మాత్రం టీచర్ కు శిక్ష పడాలని చెబుతున్నారు.
స్కూల్ టీచర్ తప్పు చేస్తే స్కూల్ ను మూసేయడం సరి కాదని ఆయన వెల్లడించారు.డీఎంకే పార్టీ స్కూల్ యాజమాన్యాన్ని కావాలని టార్గెట్ చేస్తోందని అవసరమైతే ఆ స్కూల్ కు తాను న్యాయ సహాయం చేస్తానని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొనడం గమనార్హం.
ఈ స్కూల్ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.