సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా సపరేట్ గుర్తింపు దక్కించుకున్న విశాల్ సామాజికంగా కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.అదే రీతిలో పలు వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే.
అప్పట్లో కోలివుడ్ ఇండస్ట్రీలో తమిళ నిర్మాణ మండలి నడిగర్ ఎన్నికలలో.పోటీ చేసి అనేక వివాదాల్లో విశాల్ చిక్కుకోవడం తెలిసిందే.
ఇదిలావుంటే ఇటీవల కుటుంబసమేతంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని విశాల్ కలవడం జరిగింది.
ఈ సందర్భంగా తాను చేపట్టిన అనేక కార్యక్రమాలు అదేరీతిలో తన ట్రస్టు ద్వారా చేపట్టే సామాజిక అంశాల గురించి వెంకయ్య నాయుడుకు వివరించడం జరిగింది.ఈ సందర్భాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్న క్రమంలో విశాల్.వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిగా అభివర్ణించడం తో.నెటిజన్లు విశాల్ పై మండిపడుతున్నారు.ఉపరాష్ట్రపతి కి అదే రీతిలో రాష్ట్రపతికి కూడా తేడా తెలియదా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అసలు దేశానికి కీలకం గా ఉంటే నాయకులు.ఎవరో కూడా తెలియకుండా ఈ విధంగా వ్యవహరించడం అజ్ఞానానికి నిదర్శనం అంటూ మరికొంతమంది సీరియస్ అవుతున్నారు.
ఏదిఏమైనా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని రాష్ట్రపతిగా విశాల్ సోషల్ మీడియాలో పేర్కొనడంతో మరో వివాదంలో చిక్కుకున్నట్లూ అయింది.