టాలీవుడ్ సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.ఈయనను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
హీరోగా ఈయన చేసిన సినిమాలు చాలానే సక్సెస్ సాధించాయి.అయితే గత కొన్నేళ్లుగా కనుమరుగు అయినా ఈ హీరో మళ్ళీ రవితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.
కొన్నేళ్ల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దమ్ము సినిమాలో నటించాడు.ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.దీంతో మళ్ళీ కొన్నేళ్ల పాటు ఈయన కనిపించకుండా పోయాడు.ఇక ఇటీవల రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమాలో వేణు పోలీస్ పాత్రలో నటించాడు.
ఈ సినిమా ప్లాప్ అయినా కూడా ఈయన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.
ఇక ఈ సినిమా వేణు తర్వాత మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి.మహేష్ బాబు తన 28వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు.
ఈ సినిమాలో వేణు ఆఫర్ అందుకున్నట్టు తాజాగా ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.
వేణు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటికే హీరోగా స్వయంవరం సినిమాలో నటించాడు.
ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి పని చేయ బోతున్నారు.మరి ఈసారి అయినా వేణు నటించే సినిమా ఈయనకు కలిసి వస్తుందో లేదో చూడాలి.
త్రివిక్రమ్ అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు.ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.
అందులోను 11 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.