కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి.దీంతో సినిమాని నమ్ముకొని ఉన్న కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
జూనియర్ ఆర్టిస్ట్ ల నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ కూడా రోజు కూలీ మీద ఆధారపడి బ్రతుకుతారు.అయితే సినిమాలు లేకపోవడం వలన వీరి అవస్థలు వర్ణనాతీతం.
కొంత మంది పెట్టేబేడా సర్దుకొని సొంత ఊళ్ళకి వెళ్లిపోయారు.అయితే సొంత ఊరికి వెళ్లలేని వాళ్ళు అక్కడే ఉంటూ ఆర్ధిక ఇబ్బందులు పడుతూ ఏదో దొరికిన పని చేసుకుంటున్నారు.
ఇలా సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు నడుం బిగించారు.వారికి తోచిన సాయం అందించారు.
టాలీవుడ్ లో చిరంజీవి పెద్ద దిక్కుగా ఉండి చారిటీ సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా సినీ కార్మికులకు సాహయం చేస్తున్నారు.ఇక కోలీవుడ్ ఓ సినీ కార్మికుల్ని ఆదుకునే విషయంలో హీరో సూర్య ముందు వరుసలో ఉంటాడు.
కొద్ది రోజుల క్రితం సినీ ఆర్టిస్టుల కోసం భారీ మొత్తంలో విరాళం ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు.
మరో సారి వారిని ఆదుకోవడానికి సూర్య ముందుకి వచ్చాడు.కరోనాతో ప్రాణాలు కోల్పోయిన ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా కార్మికుల కుటుంబాల సహాయార్థం 1.5 కోట్లు విరాళంగా అందజేశాడు.ఈ మేరకు ఎఫ్ఈఎఫ్ఎస్ఐ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణికి సూర్య తండ్రి చెక్కును అందజేశారు.కష్టంలో ఉన్న సినీ కార్మికులని ఆదుకోవడమే కాకుండా కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకి కూడా తనకి తోచిన సాయం అందించడం ద్వారా ఇప్పుడు వారికి సూర్య దేవుడులా మారిపోయాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల కారణంగా తన కొత్త సినిమాని ఒటీటీలో రిలీజ్ చేయాల్సి వస్తుందని, ఈ విషయంల్లో అభిమానులు తనని అర్ధం చేసుకోవాలని సూర్య విజ్ఞప్తి చేశాడు.