కమెడియన్ గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని ఒకానొక సమయంలో బ్రహ్మానందం కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడుగా సునీల్ కొనసాగుతూ వచ్చారు.తరువాత హీరోగా టర్న్ తీసుకొని ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు.
తరువాత హీరోగా చేసిన పడుతూలేస్తూ సినిమాలు చేశాడు.అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాకపోవడంతో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకొని సినిమాలు చేస్తున్నాడు.
తన స్నేహితుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా మేరకు సునీల్ మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.అలాగే విలన్ గా కూడా నటించి ఇప్పటికే మెప్పించాడు.
అల్లు అర్జున్ పుష్ప సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా సునీల్ కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నాక త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలలో సునీల్ కి క్యారెక్టర్స్ ఇచ్చాడు.
అయితే ఈ పాత్రలు అతని కెరియర్ కి ఏ విధంగా ఉపయోగపడలేదు.సునీల్ చేయాల్సిన అవసరం లేని పాత్రలని అతనికి త్రివిక్రమ్ ఆఫర్ చేసాడని విమర్శలు వచ్చాయి.
అయితే ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కనున్న సినిమాలో సునీల్ కి ఓ పవర్ ఫుల్ రోల్ ని త్రివిక్రమ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.తనదైన శైలిలో ఫుల్ లెంత్ కామెడీ పండించే పాత్రలో సునీల్ ఈ చిత్రంలో కనిపిస్తాడని బోగట్టా.
గతంలో త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలలో సునీల్ కి బలమైన పాత్రలు ఇచ్చాడు.అలాగే ఈ సినిమాలో కూడా ఆయనకి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.