మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఐదుగురు సభ్యులు మా అధ్యక్ష పదవికి పోటీ పడుతుండగా ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తున్నారు.
ఇక ఈసారి ప్రత్యేకంగా లోకల్ నాన్ లోకల్ అన్న మాట బాగా వినిపిస్తుంది.నాన్ లోకల్ అయిన ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం కొందరికి నచ్చట్లేదు.
ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతుందని చెప్పొచ్చు.
అయితే ఈ క్రమంలో సీనియర్ హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు లోకలేనని అన్నారు.వైద్యులు, రైతులు తాము నాన్ లోకల్ అనుకుంటే జనాలకు వైద్య చికిత్స, ఆహారం కూడా అందదని ఆయన అన్నారు.
పరోక్షంగా ప్రకాష్ రాజ్ కు సుమన్ మద్ధతు ప్రకటించారు.జాతీయ వైద్య దినోత్సవం సనర్భంగా హైదరాబాద్ అమీర్ పేట లో అస్టర్ ప్రైం హాస్పిటల్ లో కార్యక్రమానికి వచ్చిన సుమన్ కరోనా టైం లో వైద్యులు చేసిన సేవలు చాలా గొప్పవని అన్నారు.
ఈ సందర్భంగా మా ఎన్నికల గురించి ఆయన స్పందించారు.అందరు కలిసికట్టుగా ఉండాలని లోకల్, నాన్ లోకల్ అనే ఫీలింగ్ వద్దని ఆయన అన్నారు.
ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా నాన్ లోకల్ కార్డ్ వాడుతున్నారు కొందరు వ్యక్తులు.ఇంకా ఎన్నికలకు రెండు నెలలు టైం ఉండగా ఇప్పటినుండే మా ఎన్నికల రగడ మొదలైందని చెప్పాలి.
ప్రకాష్ రాజ్ తరపున ప్యానెల్ ప్రకటించగా మిగతా సభ్యులు కూడా ఆ పనిలో ఉన్నారు.