దివంగత నటుడు, హీరో శ్రీహరి గురించి మనందరికీ తెలిసిందే.మొదట విలన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీహరి ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.
అలాగే సహాయ నటుడిగా కూడా అనేక చిత్రాల్లో నటించాడు.పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి ఆ పాత్రకు న్యాయం చేయగలనట్టుడు శ్రీహరి.
అటువంటి శ్రీహరి 2013 అక్టోబర్ 9న మరణం ఒకేసారిగా తెలుగు ఇండస్ట్రీని కలచివేసింది.ఆయన మరణ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా గురయ్యారు.
కాగా ఆయన చనిపోయి ఇప్పటికీ దాదాపు 9 ఏళ్ళు కావస్తున్నా కూడా ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.
అయితే శ్రీహరి మరణానికి సంబంధించిన కొన్ని విషయాలను గతంలో శ్రీహరి భార్య డిస్కో శాంతి తెలిపిన విషయం తెలిసిందే.
తాజాగా మరొకసారి ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది డిస్కో శాంతి.డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమించి ఈ 1996లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఇక ఆమెను పెళ్లి చేసుకున్న సమయానికి ఆమె ఐటమ్ సాంగ్స్ లో ఫుల్ క్రేజ్ లో ఉంది.కాగా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా జన్మించారు.
అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో శ్రీహరి మరణం ఒక్కసారిగా ఆయన కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేసింది.తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా డిస్కో శాంతి మాట్లాడుతూ.
నా భర్త శ్రీహరి చనిపోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి.
ఆయన బ్రతికున్న రోజులో సాయం కోసం ఎవరు ఇంటికి వచ్చిన లేదనకుండా సహాయం చేసేవారు.సినిమాల్లో ఆయన ఎన్నో కోట్లు సంపాదించారు.కానీ ప్రస్తుతం మాత్రం మా కుటుంబ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా మారింది అని డిస్కో శాంతి చెప్పుకొచ్చింది.
నా ఇద్దరు కొడుకులు పెద్దకొడుకు మేఘాంశ్ రాజ్ దూత్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఇక తర్వాత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కోతికొమ్మచ్చి అనే సినిమాను మొదలుపెట్టగా ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిందట.
కానీ ఇప్పటివరకు ఆ సినిమా విడుదల కాలేదు.అయితే ఒకవేళ హీరో శ్రీహరి కనుక బతికే ఉంటే కొడుకు ఇండస్ట్రీ అరంగ్రేటం మరొక రేంజ్ లో ఉండేదని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.