కెరీర్ మొదట్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన సోనూసూద్ తెలుగులో సూపర్, అతడు, అరుంధతి, దూకుడు, జులాయి, ఆగడు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్న సోనూసూద్ విలన్ గా నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు హిట్లు కావడం గమనార్హం.
అయితే ప్రేక్షకుల దృష్టిలో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో మాత్రం హీరో అయ్యాడు.
దేశంలో కష్టాలు పడుతున్న వందల మందికి సోనూసూద్ సాయం చేశారు.
ఇప్పటికీ ఆ సహాయాలను సోనూసూద్ కొనసాగిస్తున్నాడు.ఆస్తులను తనఖా పెట్టి మరీ సోనూసూద్ ఇతరులకు సాయం చేస్తూ ఉండటాన్ని రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ప్రశంసిస్తున్నారు.
ఒకప్పుడు విలన్ ఇమేజ్ ఉన్న సోనూసూద్ ను దేశంలోని ప్రజలు రియల్ హీరోగా భావిస్తున్నారు.దీంతో సోనూసూద్ సైతం విలన్ పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
మరోవైపు దర్శకులు సైతం తమ సినిమాల్లో సోనూసూద్ పాత్ర పరిధిని పెంచేందుకు స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.దర్శకులు సైతం సోనూసూద్ ను పాజిటివ్ గానే చూపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.సోనూసూద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాజిటివ్ పాత్రల్లోనే తాను ఎక్కువగా నటిస్తానని వచ్చే ఏడాది వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.
సోనూసూద్ అభిమానులు సోనూ చేస్తున్న సేవలకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పురస్కారాలతో సత్కరిస్తే బాగుంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో ఆచార్య సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.భవిష్యత్తులో సోనూసూద్ హీరోగా కూడా నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.సోనూసూద్ సినిమాల ద్వారా సంపాదించే ఆదాయంతో పాటు తన వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సహాయల కోసం ఖర్చు చేస్తున్నారు.సోనూసూద్ కు అతని స్నేహితులలో కొంతమంది సహాయ కార్యక్రమాలు చేయడానికి సహకారం అందిస్తున్నారని తెలుస్తోంది.