సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు తమ సంపదను ఎంతగానో పెంచుకుంటూ పోతుంటారు.ఎంత ఉన్నా తక్కువే అన్నట్లు సంపాదన పైన బాగా దృష్టి పెడుతుంటారు.
అంతేకాకుండా సినిమాలలో అవకాశాలు వచ్చినప్పుడే వెంటనే డబ్బును అవసరమైన వాటికి వినియోగించుకుంటారు.ఇలా ఎంతమంది నటులు తమ తమ ఆలోచనలతో ధనవంతులు అవుతుంటారు కానీ కొందరు నటులు ఎటువంటి ఆలోచనలు లేకుండా డబ్బులు వృథా ఖర్చు చేసి తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్లు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే సినీ పరిశ్రమలో వందల కోట్లు సంపాదించడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.దీని గురించి ప్రముఖ సీనియర్ నటుడు, రాజకీయ నేత మురళీ మోహన్ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.
తాను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండటానికి కారణం ఒకటి ఉందంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.ఒకానొక సమయంలో ఆయన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని డిస్ట్రిబ్యూషన్ లో పెట్టి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు.
ఖాళీ చేతులతో శోభన్ బాబు ముందు నిలబడగా ఆయన చెప్పిన జీవిత సత్యం మొత్తం తన జీవితాన్నే మార్చి వేసిందని తెలిపాడు.
ప్రస్తుతం మురళీమోహన్ జయభేరి రియల్ ఎస్టేట్, కన్ స్ట్రక్షన్స్ పేరిట కొన్ని వేల కోట్ల టర్నోవర్ సంస్థలను నడిపిస్తున్నారు.తాను ఇంత సంపాదించడానికి కారణం భూమి పై పెట్టుబడి పెట్టడం.ఈ విషయాన్ని చెప్పింది కూడా శోభన్ బాబు అంటూ తెలిపాడు.
సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి శోభన్ బాబు ఇలాంటి సలహాలే చెప్పేవారట.చంద్రమోహన్ కూడా ఈ స్థాయిలో ఉండడానికి కారణం శోభన్ బాబే అని తెలిసింది.
భూమి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనదని.అది ఎప్పటికి ఉన్నదాని విలువ మాత్రం తగ్గదని.ఇంకా రాబోయే రోజుల్లో కూడా భూమికి ఎక్కువ విలువ ఉంటుందని.పలుమార్లు శోభన్ బాబు తెలిపారట.
అంతే కాకుండా ఆయన కొనడమే కాకుండా ప్రతి ఒక్కరికి సలహాలు ఇస్తూ భూమిపై పెట్టుబడులు పెట్టామని తెలిపే వాడట.దీంతో ఎంతో మంది నటులు ఖాళీ స్థలాలు ఉన్నచోట వాటిని కొని మళ్లీ వాటిపై పెట్టుబడి పెట్టి మరిన్ని స్థలాలను కొనేవారు.
ఇలా చాలా మంది నటులు తమ భూముల పైనే ఆర్థికంగా దృఢంగా ఉన్నారని అర్థమవుతుంది.