ఆర్.ఎక్స్ 100 సినిమాతో తొలి ప్రయత్నంలోనే అజయ్ భూపతి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అని అనిపించుకున్నారు.
తన రెండో సినిమాగా శర్వానంద్, సిద్దార్థ్ లతో మహాసముద్రం అనే సినిమాను అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు.గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సిద్దార్థ్ ఈ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనుండటం గమనార్హం.
బాయ్స్ మూవీతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన సిద్దార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తెలుగులో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.
సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమా సిద్దార్థ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగా పెంచింది.
తెలుగులో సిద్దార్థ్ హీరోగా చివరగా ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించగా ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఫ్లాప్ కావడంతో సిద్దార్థ్ ఆ తరువాత తమిళ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు.అయితే సిద్దార్థ్ రీఎంట్రీ మూవీ మహాసముద్రం కోసం ఏకంగా రూ.3 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.
మహాసముద్రంకు సిద్దార్థ్ పారితోషికం గురించి తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ సాధించిన హీరోలు సైతం ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం లేదు.సిద్దార్థ్ మహాసముద్రం సినిమాతో సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ లో మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాదే మహాసముద్రం రిలీజ్ కానుంది.మొదట ఆగష్టు 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటన వెలువడగా ఆ తేదీకి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం.ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శర్వానంద్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.