టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న సీనియర్ నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్నారు.నరేష్ తాజాగా అమ్మ విజయనిర్మల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
గుంటూరు జిల్లాలోని నరసరావుపేట అమ్మ ఊరు అని అమ్మకు నలుగురు అన్నాదమ్ములు కాగా అమ్మ ఒక్కతే ఆడపిల్ల అని నరేష్ చెప్పుకొచ్చారు.
అమ్మ ఒక ముసలి డ్యాన్స్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారని ఆ డ్యాన్స్ మాస్టర్ కు పళ్లు లేకపోవడంతో అమ్మ వెక్కిరించగా ఆ డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ నేర్పించనని చెప్పాడని నరేష్ తెలిపారు.
కృష్ణుడి వేషంలో పాండురంగ మహత్యం సినిమాలో నటించడంతో నటిగా అమ్మ కెరీర్ మొదలైందని నరేష్ అన్నారు.అమ్మ తన ఫస్ట్ శాలరీతో నాకోసం లాక్టోజెన్ అనే పాల డబ్బాను కొన్నారని నరేష్ వెల్లడించారు.
తాను చిన్నప్పుడు చాలా అల్లరి చేశానని పదో తరగతి తాను పాస్ కాకపోవడంతో అమ్మ బాధ పడ్డారని నరేష్ అన్నారు.అమ్మ డాక్టర్ చదివించాలని అనుకున్నారని తాను డాక్టర్ కాలేకపోయినా డాక్టరేట్ తెచ్చుకుని అమ్మకు తృప్తి కలిగించానని నరేష్ వెల్లడించారు.తాను పాలిటిక్స్ లోకి వెళ్లడం అమ్మకు ఇష్టం లేకపోయినా అమ్మ నో చెప్పకుండా ప్రోత్సహించారని నరేష్ పేర్కొన్నారు.
షూటింగ్ కు తాను ఆలస్యంగా వెళితే అమ్మ డిసిప్లేన్ లేకపోతే తనకు నచ్చదని చెప్పారని అమ్మ ముందు హీరోయిన్ తో కలిసి టబ్ లో ఒక సీన్ లో నటించాలని ఆ సమయంలో తాను సిగ్గు పడగా నువ్వు నటుడివి అనే విషయం గుర్తుపెట్టుకో అని అమ్మ సూచించిందని నరేష్ చెప్పుకొచ్చారు.అమ్మకు సమయం విలువ బాగా తెలుసని టైమ్ విలువ తెలుసు కాబట్టి ఇన్ని పనులు చేయగలుగుతున్నానని అమ్మ చెప్పేదని నరేష్ పేర్కొన్నారు.