రాజు,పేద అన్న తేడా లేకుండా ఈ కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరినీ కూడా పట్టి పీడిస్తుంది.ఈ కరోనా ధాటికి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా లిస్ట్ లో చేరిపోతున్నారు.
ఆమధ్య ప్రముఖ సింగర్ కనికా,అలానే ప్రముఖ నిర్మాత కరోని పట్టి పీడిస్తుంది.ఇప్పటికే ప్రముఖ నిర్మాత మొరానీ ఆయన కూతుళ్లు ఇద్దరికీ కూడా కరోనా సోకి మొత్తానికి దాని నుంచి బయటపడ్డారు.
అయితే ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ నటుడి తల్లికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తుంది.దీనితో ఆయన గారు హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.
బాలీవుడ్ ప్రస్థానం ఫేమ్ యాక్టర్ సత్యజిత్ దూబే తల్లికి కరోనా పాజిటివ్ అన్నట్లుగా తేలింది.దీనితో దూబే తన సోదరితో కలిసి హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపాడు.
ఇటీవల దూబే తల్లి తలనొప్పి,హై ఫీవర్,ఒళ్లు నొప్పులు రావడం తో అనుమానం కలిగి కరోనా పరీక్షలు నిర్వహించడం తో ఆమెకు పాజిటివ్ ఉన్నట్లు వెల్లడైంది.దీనితో ఆమెను హుటాహుటిన ముంబై లోని నానావతి హాస్పటల్ కు తరలించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే అమ్మకి కరోనా పాజిటివ్ అని తేలడం తో నేను,నాసోదరి హోం క్వారంటైన్ లో ఉన్నామని, ప్రస్తుతం మా ఇద్దరికీ కూడా ఎలాంటి కరోనా లక్షణాలు లేవని దూబే తెలిపాడు.ప్రతి రోజు అమ్మ తో ఫోన్,వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నామని,ఆమెతో టచ్ లోనే ఉంటున్నట్లు పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న తల్లి త్వరలోనే కోలుకుంటుందని భావిస్తున్నట్లు దూబే పేర్కొన్నాడు.జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను కలలో కూడా ఊహించలేదంటూ సత్యజిత్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాలను వెల్లడించాడు.దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.ఇప్పటికే మహారాష్ట్రలో 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయిన విషయం విదితమే.