కొంత మంది సెలబ్రెటీలు అవకాశాలు రానప్పుడు, కెరియర్ ముగిసిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోతారు.హాలీవుడ్ నుంచి ఇండియన్ సెలబ్రెటీల వరకు చాలా మంది గతంలో ఈ మార్గంలోకి వచ్చారు.
ఇప్పుడు మరో అందాల భామ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి సమాజసేవలో భాగమవుతానని, సినిమాలు వదిలేస్తున్నా అని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.ఆమె సనాఖాన్.
ఈ పేరు వింటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ తెలుగులో కత్తి, మిస్టర్ నూకయ్య సినిమాలలో హీరోయిన్ అని చెబితే వెంటనే గుర్తు పడతారు.ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోకపోయిన కొంత వరకు నటిగా రాణించింది.
బాలీవుడ్ లో ఓ బోల్డ్ కంటెంట్ మూవీతో పాపులర్ అవ్వాలని ప్రయత్నం చేసింది.అక్కడ అది వర్క్ అవుట్ కాలేదు.
అడపాదడపా చిన్న చిన్న అవకాశాలు అయితే వస్తున్నాయి.అయితే సనా ఖాన్ తాను సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతున్నానని షాకింగ్ ప్రకటన చేశారు.
ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ లేఖను పోస్ట్ చేశారు.తన జీవితంలో అత్యంత కీలకమైన విషయం గురించి చెబుతున్నానని, కొన్నేళ్లుగా తాను సినీ పరిశ్రమలో ఉన్నానని, అభిమానుల ఆశీర్వాదాలతో ఇక్కడ తాను పేరు, డబ్బు, గౌరవం సంపాదించుకున్నానని తెలిపారు.
అయితే ఓ మనిషి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టేది కేవలం డబ్బు, పేరు కోసమేనా? అంటూ తనలో ఆలోచన మొదలైందని చెప్పుకొచ్చారు.సహాయం అవసరమైన వారికి సేవ చేయడం అవసరం కాదా? అనిపించిందని తెలిపారు.ఒకవేళ మనిషి ఏ క్షణంలోనైనా మరణిస్తే అనంతరం ఏం జరుగుతుందని పేర్కొన్నారు.తాను చాలా కాలంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నానని, తాను చనిపోయాక ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలనుందని చెప్పారు.
దీనికి తన మతంలోనే సమాధానం లభించిందని చెప్పారు.చనిపోయాక మంచి జీవితం పొందడం కోసమే ఈ జీవితమని, ప్రస్తుత జీవితాన్ని నిస్సహాయులకు సేవ చేయాలన్నదే దేవుడి ఆజ్ఞ అని తెలిపారు.
అందుకే దేవుడి ఆజ్ఞ ప్రకారం సినిమాలకి స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక, సామాజిక సేవలో భాగం అవుతానని సనాఖాన్ ఈ లేఖలో పేర్కొంది.