క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం సినిమా రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.వైష్ణవ్ తేజ్ కు జోడీగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.
నటుడు సాయిచంద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఫిదా, ఉప్పెన సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న సాయిచంద్ తాను చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నారు.
సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించే సమయంలో చిరంజీవి తనను ఉప్పెన సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించాలని కోరారని తాను ఫిదాలో తండ్రి పాత్రలో నటించలేక చస్తున్నానని మళ్లీ తండి పాత్ర చేయాలా? అని అన్నానని సాయిచంద్ తెలిపారు.ఆ తర్వాత చిరంజీవి ఆ పాత్ర అద్భుతమైన పాత్ర అని చెప్పి తనను ఒప్పించారని సాయిచంద్ చెప్పుకొచ్చారు.
తాను చిరంజీవి మాట వినకుండా ఉండి ఉంటే మంచి కొడుకును పోగొట్టుకునేవాడినని ఆయన అన్నారు.
షూటింగ్ సమయంలో ప్రతిరోజూ వైష్ణవ్ తనను పలకరించేవాడని వైష్ణవ్ తేజ్ సంస్కారం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని సాయిచంద్ వెల్లడించారు.
వైష్ణవ్ కు మేనమామల నుంచి ప్రొఫెషనలిజం వచ్చిందని సాయిచంద్ పేర్కొన్నారు.వైష్ణవ్ తనకు పరిచయం కావడానికి కారణమైన బుచ్చిబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నానని సాయిచంద్ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత క్రిష్ నుంచి కాల్ వచ్చిందని వైష్ణవ్ తండ్రి పాత్ర అని చెప్పడంతో వెంటనే ఓకే చెప్పానని సాయిచంద్ అన్నారు.
కొండపొలం షూటింగ్ అడవిలో జరిగిందని అడవిలో తనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని సాయిచంద్ వెల్లడించారు.నర్తనశాల మూవీలో అర్జునుడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ నటిస్తే ఎల్.విజయలక్ష్మి కోడలు శశిరేఖ పాత్రలో నటించారని ఇకపై తాను రకుల్ ను కోడలు పిల్ల అని పిలుస్తానని సాయిచంద్ అన్నారు.రేపు రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.