కోవిడ్ వచ్చి వెళ్లిన తర్వాత నా కాళ్లు పడిపోయాయ్.. సీరియల్ నటుడు సాయి కిరణ్ షాకింగ్ కామెంట్స్?

గత రెండు సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా మహమ్మారి వేరియంట్లో రూపంలో దాడి చేస్తూ ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తోంది.ఈ క్రమంలోనే కరోనా రెండవ దశ ఇండియాలో తీవ్రస్థాయిలో వ్యాపించి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది.

 Actor Sai Kiran-shares Covid Real Incident Happened His Life Sai Kiran, Serial A-TeluguStop.com

ఇప్పటికీ కరోనా పేరు ఎత్తితే ఎంతోమంది భయపడిపోతున్నారు.ఇలా కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోగా ఎంతోమంది బతికి బట్ట కట్టారు.

మరికొందరిలో అసలు కరోనా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి.

కరోనా మహమ్మారి బారిన ఎంతోమంది సినీ నటులు ఈ మహమ్మారి బారిన పడ్డారు.

అలాంటి వారిలో సినీ నటుడు సాయికిరణ్ ఒకరు.ఈయన ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందిన సాయి కిరణ్ ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇకపోతే ఆయన తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కరోనా బారిన పడ్డారని ఆ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు.కరోనా వచ్చి వెళ్లే వరకు తనకు కేవలం రుచి, వాసన మాత్రమే తెలియలేదని కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తనకు అసలు సమస్య వచ్చిందని తెలిపారు.

Telugu Covid, Sai Kiran, Serial, Tollywood-Movie

రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చిన తర్వాత పూర్తిగా తన కాళ్ళు నీరసించి పోయాయని తెలిపారు.కాలు పక్కకు కలపడానికి కూడా వీలు లేకుండా పడిపోయాయని కేవలం బెడ్ మీద పరిమితం అయ్యానని సాయికిరణ్ తెలిపారు.ఇక కరోనా వల్ల నా కాళ్లు రెండూ పడిపోయాయి కేవలం వీల్ చైర్ కి మాత్రమే పరిమితం అవ్వాలి.వీల్ చైర్ లోనే నటించాలేమోనని తాను చాలా భయపడినట్లు తెలిపారు.

ఇక కాలు పూర్తిగా పడిపోవడంతో వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ఆయన పరీక్షలు చేసి బ్లడ్ లో బి 12 విటమిన్ లోపించడం కారణంగా ఇలా జరిగిందని తెలిపినట్లు సాయి కిరణ్ వెల్లడించారు.

Telugu Covid, Sai Kiran, Serial, Tollywood-Movie

వెంటనే అందుకు సంబంధించిన మెడిసిన్ వాడటం వల్ల తిరిగి నా కాళ్ళు సాధారణస్థితికి వచ్చాయని ఈ సందర్భంగా సాయికిరణ్ కరోనా సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి బయటపెట్టారు.నిత్యం మాస్క్ శానిటైజర్ వాడినప్పటికీ కరోనా బారిన పడ్డారని ఈ సందర్భంగా సాయి కిరణ్ తెలిపారు.ప్రస్తుతం కరోనా వైరస్ మరొక వేరియంట్ రూపంలో దాడి చేయడానికి సిద్ధమైందని ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని సాయికిరణ్ గతంలో తాను అనుభవించిన విషయాల గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇక ప్రస్తుతం ఈయన స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో మహేంద్ర భూషణ్ పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube