స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ సినిమాలో బన్నీతో పాటు విలన్గా మద్దాలి శివారెడ్డి అనే పాత్రలో నటించిన భోజ్పురి నటుడు రవికిషన్కు చాలా మంచి గుర్తింపు లభించింది.
ఆ సినిమా విజయం సాధించడంలో విలన్ పాత్ర కూడా చాలా కీలకంగా మారింది.ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తనదైన మార్క్ వేసుకోవడంలో ఈ నటుడు సక్సెస్ అయ్యాడు.
అటు ఎంపీగా ఎన్నికైన రవికిషన్ రాజకీయంగాను తన మార్క్ వేసుకుంటున్నాడు.
అయితే తాజాగా రవికిషన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది.
ఆయన పీఏ గుడ్డూ పాండేకు కరోనా పాజిటివ్ అని తేలింది.దీంతో అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
కాగా ఈ విషయంతో రవికిషన్ అండ్ ఫ్యామిలీ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.వారు కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు.
తమ పీఏ త్వరగా ఈ కరోనా వైరస్ నుండి కోలుకోవాలని వారు కోరుకున్నారు.ఏదేమైనా కరోనా వైరస్ నుండి ప్రజలు తమను తామే కాపాడుకోవాలని రవికిషన్ కోరాడు.
కాగా ఇటు టాలీవుడ్లోనూ కరోనా వైరస్ విజృంభన రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.ఇప్పటికే పలువురు సినిమా, సీరియల్ ఆర్టిస్టులకు ఈ వైరస్ సోకగా పలువురు స్టార్స్ హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు.
అటు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కూడా కరోనా వైరస్ బారిన పడటంతో ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్నారు.అందుకే మీరు కూడా కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి.