ఈమధ్య టాలీవుడ్ బ్యూటీస్.ఓవైపు సినిమారంగంలో, మరోవైపు వ్యాపార రంగంలో బాగా బిజీ గా మారుతున్నారు.
ఇప్పటికే కొందరు హీరోయిన్లు కొన్ని బిజినెస్ లలో బిజీగా మారారు.ఇక కొందరు కొన్ని గుర్తింపు పొందిన వాటిలో బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్నారు.
ఇప్పటికే సమంత వంటి టాలీవుడ్ బ్యూటీస్ పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా నియమితులైన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే మరో టాలీవుడ్ బ్యూటీ ఖజానా జ్యువెలరీ కు బ్రాండ్ అంబాసిడర్ ఎన్నికయింది.
ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే.
టాలీవుడ్ కన్నడ బ్యూటీ రష్మిక మందన.
ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక ఏకంగా అతి తక్కువ సమయంలో స్టార్ స్థానాన్ని అందుకుంది.ఇక ఈ బ్యూటీ తాజాగా ఆభరణాల రిటైల్ సంస్థ ఖజానా జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకోబడింది.
అక్షయ తృతీయ భారతదేశమంతటా ప్రింటింగ్, బహిరంగ, టీవీ ప్రకటన ద్వారా ఖజానా జ్యువెలరీ కి సంబంధించిన కొన్ని డిజైన్లలను ప్రమోట్ చేయనుంది.
ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.ఖజానా గొప్పదనం గురించి అందరికీ తెలిసిన విషయం అంటూ, తనను దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది.వారికి ప్రత్యేకమైన నమూనాలు, ఉన్నతమైన విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అంటుంది.
ఇక ఇందులో ఆమె భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని..ఇక ఖజానా స్టోర్ లో ఉన్న కొత్త కలెక్షన్ చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను అని తెలిపింది.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉంది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.