నటుడు రాజీవ్ కనకాల “మా” అధ్యక్ష ఎన్నికలలో తన మద్దతు మంచు విష్ణు ప్యానల్ కే అని స్పష్టం చేశారు.అధ్యక్ష భవనం అదే రీతిలో.
మా అసోసియేషన్ సభ్యులు సంక్షేమంపై విష్ణుకి పూర్తి అవగాహన ఉందని చెప్పుకొచ్చారు.అంత మాత్రమే కాక.విష్ణు కి బాలయ్య బాబు సపోర్ట్ ఉందని.త్వరలో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ సపోర్ట్ కూడా విష్ణు కే ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
వాళ్లు మాత్రమే కాక ఇతర నటీనటులు కూడా విష్ణుకి మద్దతు ఇవ్వొచ్చని, ఎక్కడో ఉండే వాళ్ళు మన ఇంట్లో పెద్దరికం తీసుకుంటానంటే ఒప్పుకుంటారా.? అంటూ పరోక్షంగా ప్రకాష్ రాజ్ పై విమర్శల వర్షం కురిపించారు.
గత ఎలక్షన్ సమయంలో శివాజీరాజా ప్యానల్ నుంచి పోటీ చేసి.తాను మాత్రమే గెలవడం జరిగిందని కోశాధికారి పదవిని పొందటం జరిగిందని.నరేష్ అధినాయకత్వం లో.పని చేయడం జరిగిందని స్పష్టం చేశారు.ఈ క్రమంలో ఇండస్ట్రీలో అవకాశాలు లేని ఆర్టిస్టుల కోసం.ఎంతో హెల్ప్ చేయడం జరిగిందని 40 మందికి అవకాశాలు వచ్చేలా చేసినట్లు తెలిపారు.ఈ క్రమంలో ప్రస్తుతం పోటీ పడుతున్న వాళ్ళు అమ్మ గురించి ఎన్నో కామెంట్లు చేస్తున్నారని సీరియస్ అయ్యారు.ఈ క్రమంలో తాను మాత్రం విష్ణు ప్యానల్ కి మద్దతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.