గత 20 సంవత్సరాలుగా బుల్లితెర నంబర్ 1 యాంకర్ గా సుమ కనకాల కొనసాగుతున్నారనే సంగతి తెలిసిందే.సుమకు ఉన్న స్పెషల్ టాలెంట్ వల్ల ఆమెకు కొత్త షోలకు హోస్ట్ గా చేసే ఛాన్స్ రావడంతో పాటు ప్రస్తుతం సుమ హోస్ట్ గా చేస్తున్న షోలకు సైతం మంచి రేటింగ్స్ వస్తుండటం గమనార్హం.
అయితే తాజాగా రాజీవ్ కనకాల ఒక ఇంటర్య్యూలో సుమ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
రాజీవ్ కనకాల, సుమ మధ్య గ్యాప్ ఉందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే తనకు సుమకు మధ్య ఎటువంటి గ్యాప్ లేదని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.తాము మణికొండలో ఇల్లు నిర్మించుకున్న సమయంలో అక్కడ ఎవరూ ఉండేవారు కాదని అయితే పిల్లలకు స్కూల్ బస్సు ఎల్ అండ్ టీ నుంచి బయలుదేరేదని రాజీవ్ కనకాల అన్నారు.
ఆ రీజన్ వల్ల ఎల్ అండ్ టీకి షిఫ్ట్ అయ్యామని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.
అయితే రెండు చోట్ల ఇళ్లు ఉండటంతో మెయింటనెన్స్ ఖర్చులు పెరిగాయని అందువల్లే మళ్లీ మణికొండకు వచ్చానని రాజీవ్ అన్నారు.
సుమ సక్సెస్ కు, పేరుప్రఖ్యాతులకు తను కారణం కాదని రాజీవ్ అన్నారు.సుమ స్పాంటేనియస్ గా ఉండటంతో పాటు పట్టుదల, చలాకీతో ఉంటారని రాజీవ్ కనకాల వెల్లడించారు.
ఎప్పటికప్పుడు నేర్చుకోవడం సుమకు ప్లస్ అయిందని రాజీవ్ పేర్కొన్నారు.
తన కొడుకు రోషన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ఏ క్రాఫ్ట్ అనే విషయం రోషన్ చూసుకుంటాడని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.రాజీవ్ కనకాల, సుమ మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని వైరల్ అయిన వార్తలకు రాజీవ్ కనకాల ఈ విధంగా చెక్ పెట్టారు.గతంతో పోలిస్తే సుమకు కొంతవరకు ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.