స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే.కోపాన్నైనా, ఇష్టాన్నైనా దాచుకోకుండా ముక్కుసూటిగా చెప్పడానికి బాలకృష్ణ ప్రాధాన్యతనిస్తారు.
ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమాలో నటిస్తుండగా దసరా పండుగ కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.బాలకృష్ణ ఎక్కువగా పండుగల సమయంలోనే తన సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు.
ప్రముఖ నటుడు రాజా రవీంద్ర తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.బాలయ్యతో కలిసి మొదట నిప్పురవ్వ సినిమాలో నటించానని 120 రోజులు బాలయ్యతో కాంబినేషన్ సీన్లు ఉన్నాయని అన్నారు.
బాలకృష్ణ గారు, తాను ఎక్కడికెళ్లినా పక్కపక్కనే ఉండేవాళ్లమని రాజా రవీంద్ర తెలిపారు.శ్రీమన్నారాయణ సినిమా సమయంలో ఒకరోజు తాను ఆలస్యంగా షూటింగ్ కు వచ్చానని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.
ఆ సినిమా ప్రొడక్షన్ పనులు తాను చూసుకున్నానని ఒకరోజు నమస్తే బాబు అని బాలకృష్ణ గారికి చెప్పగా మొదట మేకప్ వేసుకో పరామర్శలు తరువాత అని చెప్పారని ఆ తర్వాత డైరెక్టర్ సినిమాలో జైలర్ క్యారెక్టర్ కోసం తనను ఎంపిక చేశానని చెప్పారని రాజా రవీంద్ర అన్నారు.మీరు 6.30కు వస్తారని భావించి ప్రోగ్రామ్ చెప్పలేదని ప్రొడక్షన్ వాళ్లు అన్నారని రాజా రవీంద్ర వెల్లడించారు.వాళ్లు మిస్టేక్ చేస్తే నువ్వు ఎందుకు టెన్షన్ పడతావని బాలకృష్ణ అన్నారని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.
మనం నచ్చితే బాలకృష్ణకు ఎవరేం చెప్పినా ఎక్కదని బాలకృష్ణ చాలా డిఫరెంట్ గా ఉంటారని రాజా రవీంద్ర అన్నారు.ఇష్టం లేని విషయాలు ఉంటే మాత్రం ముఖం మీదే నువ్వు నాకు కనిపించవద్దని చెబుతారని రాజారవీంద్ర కామెంట్లు చేశారు.ఎంతోమంది కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుని బాలయ్య గతంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.