ఖడ్గం సినిమాతో పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత కొన్నేళ్ల పాటు స్టార్ కమెడియన్ గా వరుస ఆఫర్లతో పృథ్వీ బిజీగా ఉన్నారు.కొన్ని నెలల క్రితం పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన పృథ్వీ సినిమాలలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పృథ్వీ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.ప్రభాకర్ రెడ్డి గారు తన కెరీర్ కు ప్లస్ చేశారో మైనస్ చేశారో తెలియదని ఒక థండరింగ్ ఇచ్చారని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.
గండిపేట రహస్యం సినిమాలో మొదట తాను అశోక గజపతిరాజు రోల్ లో నటించాల్సి ఉందని అయితే తాను పెద్దాయనలా ఉన్నానని చెప్పి తనతో వేషం వేయించారని పృథ్వీరాజ్ తెలిపారు.అయితే ఈ పాత్ర వివాదం అవుతుందని తాను అనుకోలేదని పృథ్వీరాజ్ వెల్లడించారు.
తాను అప్పుడు అయ్యప్పమాలలో ఉన్నానని పృథ్వీరాజ్ అన్నారు.తాను, ప్రభాకర్ రెడ్డి ఒక థియేటర్ కు వెళ్లగా జనం పరుగెత్తుకుంటూ కొట్టడానికి వచ్చారని ఆ సమయంలో హరికృష్ణ కారు ఎక్కాలని చెప్పి తన కారులో తీసుకెళ్లారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
హరికృష్ణ లేకపోతే తనను సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొట్టేవారని పృథ్వీరాజ్ చెప్పకనే చెప్పేశారు.
ఆ సినిమా వల్ల నాలుగేళ్లు ఇబ్బంది పడ్డానని పృథ్వీరాజ్ అన్నారు.
తన ముక్కుచెవులు కోస్తామని కూడా బెదిరించారని పృథ్వీరాజ్ వెల్లడించారు.సీనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రను సీరియస్ గా తీసుకోలేదని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
తాను బ్రహ్మాండంగా పైకి వస్తానని ఎన్టీఆర్ ఆశీర్వదించారని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.తాను దూరదర్శన్ సీరియల్స్ కూడా చేశానని పృథ్వీరాజ్ అన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ అంతిమ యాత్ర సమయంలో తాను కెమెరామేన్ గా వెళ్లి కెమెరాతో షూట్ చేశానని పృథ్వీరాజ్ వెల్లడించారు.తాను సినిమా ఆఫర్ల కోసం మద్రాస్ కు కూడా వెళ్లానని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.పృథ్వీరాజ్ మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.