టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ మొదట్లో చిన్నచిన్న పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ స్టార్ హీరోల సినిమాల్లో చేసిన పాత్రలకు మంచి పేరు రావడంతో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.2019 ఎన్నికల సమయంలో వైసీపీ గెలుపు కోసం శ్రమించిన పృథ్వీకి వైసీపీ ద్వారా ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి దక్కింది.అయితే ఒక మహిళతో పృథ్వీ అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేపులు బయటకు రావడంతో ఆయన తన పదవికి కొన్ని నెలల క్రితం రాజీనామా చేశారు.
అయితే ఎన్నికల సమయంలో పృథ్వీ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పృథ్వీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం గురించి స్పందించి స్పష్టతనిచ్చారు.చిరంజీవి, పవన్, నాగబాబులపై రాజకీయాల కోసం విమర్శలు చేశానని అన్నారు.
పవన్ పై తాను విమర్శలు చేయడం వెనుక అంతకు మించి మరే కారణం లేదని చెప్పారు.
ప్రస్తుతం చిరంజీవి గారి సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో తాను నటిస్తున్నానని.మాములుగా పవన్ పై తాను విమర్శలు చేస్తే జనాలు తనను ఇంటికొచ్చి కొడతారని చెప్పారు.అయితే చిరంజీవి, పవన్ లు ఛాన్స్ ఇచ్చినా నాగబాబు మాత్రం తనతో మాట్లాడటం లేదని అన్నారు.
పవన్ పై విమర్శలు చేసే స్థాయి తనకు లేదని పృథ్వీ వెల్లడించారు.అయితే తన దృష్టిలో పవన్ సినిమాలలో కొనసాగితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మెగా ఫ్యామిలీ హీరోలపై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన పృథ్వీరాజ్ మెగా ఫ్యామిలీ హీరోలకు అనుకూలంగా కామెంట్లు చేయడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో పృథ్వీ ఈ విధంగా కామెంట్లు చేశాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతుండగా మరి కొందరు నెటిజన్లు మాత్రం పృథ్వీ చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తుండటం గమనార్హం.