టాలీవుడ్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గురించి తెలియని వారుండరు.అయితే తెలుగులో కామెడీ, విలన్, అన్న, తమ్ముడు, వంటి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు పృథ్వి.
అయితే సినిమాల పరంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి పృథ్వి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.అయితే ఇతడి సేవలను గుర్తించినటువంటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవి బాధ్యతలను కట్టబెట్టారు.
అయితే ఇటీవల కాలంలో పృథ్వి ఈ సంస్థలో పని చేస్తున్నటువంటి ఓ మహిళతో మాట్లాడిన టువంటి సంభాషణ బయటికి రావడంతో పదవీ బాధ్యతల నుంచి తొలగించారు.అయితే ఒక్కసారిగా పదవీ బాధ్యతల నుంచి తొలగించిన అప్పటినుంచి నటుడు పృథ్వి తనను తాను నిర్దోషిగా నిరూపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇందులో భాగంగా తాజాగా ఓ మీడియా చాలా నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా పృథ్వి మాట్లాడుతూ తనంటే గిట్టని కొందరు వైకాపా నేతలు పక్కాగా ప్లాన్ చేసి తనను ఈ కేసులో ఇరికించారని అన్నారు.
అంతేకాక పోకిరి సినిమాలో ఇలియానా బట్టలు చించి రేప్ అయిపోయిందని అన్నట్లు తనని కూడా అదే విధంగా చేశారన్నారు.
అయితే తన పదవి పోయిన అప్పటినుంచి సినీ అవకాశాలు తగ్గిపోయాయని ఇటీవల కాలంలో నటుడు పృథ్వి చెప్పుకొచ్చాడు.అంతేగాకక ఒక్కసారిగా సంబంధం లేనటువంటి కేసులో ఇరుక్కోవడంతో కనీసం నా అనుకున్న వాళ్లు కూడా తనకు ఇప్పుడు దూరంగా ఉంటున్నారని తొందర్లోనే తానేంటో నిరూపించుకొని మళ్లీ ఎస్విబిసి పదవి బాధ్యతలు చేపడతారని పృద్వి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
.