టాలీవుడ్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గురించి తెలియని వారు ఉండరు.సినిమాల పరంగా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నపృథ్వీ రాజకీయాల్లో కూడా బాగానే రాణిస్తున్నాడు.
అయితే వైకాపా పార్టీకి ఇతడు చేసినటువంటి సేవలను గుర్తించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.అయితే ఈ ఆమధ్య కాలంలో పృథ్వి మరియు ఎస్వీబీసీ ఛానల్ లో పని చేస్తున్నటువంటి ఓ మహిళా ఉద్యోగితో మాట్లాడి నటువంటి సంభాషణ బయటకు రావడంతో ఛానల్ నిర్వాహకులు పృథ్వీని చైర్మన్ పదవి నుంచి తొలగించారు.
అయితే ఇటీవలే ఈ సంభాషణ గురించి పోలీసులు విచారణ కూడా చేపట్టగా పృథ్వీ నిర్దోషి అని తేలింది.దీంతో ఈ విషయాన్ని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఇటీవలే తన సోషల్ మీడియా లో వీడియోని షేర్ చేస్తూ తెలిపాడు.
ఇందులో భాగంగా ఓ సీనియర్ రిటైర్డ్ జడ్జి క్లీన్ చిట్ ఇచ్చారని తనపై ఉన్న ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలిందని అన్నారు.అంతేగాక దారినపోయే వాళ్లకి తాను సమాధానం చెప్పే అవసరం లేదంటూ తెలిపారు.
అంతేగాక నవ్వుతూ మాట్లాడిన దానికే లేని దురద మీకెందుకురా అంటూ సెటైరికల్ సెటైర్లు వేశాడు.
అలాగే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల తాను ఈ కేసు నుంచి బయటపడ్డాడని తొందర్లోనే మళ్ళీ ఎస్విబిసి చైర్మన్ పదవి పగ్గాలని చేపడతానాని ధీమా వ్యక్తం చేశారు.
అంతేగాక తనపై కావాలని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కేసులు బనాయించిన వారి అంతు చూస్తానని అని తెలిపారు.Pudhvi Phont
.