పలు షార్ట్ ఫిల్మ్స్లో నటించి, తాజాగా ‘ఇప్పట్లో రాముడిలా.’ అనే చిత్రంలో నటించిన హీరో బాల ప్రశాంత్.
ఈయన మొదటి సినిమా విడుదల అవ్వకుండానే తుదిశ్వాస విడిచాడు.ఈయన చావుకు వివాహేతర సంబంధం కారణం అని తెలుస్తోంది.
గత కొంత కాలంగా ఈయనకు పక్కనే నివాసం ఉంటున్న ఒక వివాహితతో సంబంధం ఉందట.నిన్న ఆమె భర్త లేని సమయంలో ప్రశాంత్ ఆమె ఇంటికి వెళ్లాడు.
అదే సమయంలో ఆమె బందువులు రావడంతో ఒక రూంలో దాచుకున్నాడు.
ఆమెను బందువులు తమతో తీసుకు వెళ్లారు.
అప్పుడు ఇంటికి తాలం వేయడంతో ప్రశాంత్ వెనుక నుండి వాటర్ పైపుల ద్వారా కిందకు దిగే ప్రయత్నం చేశాడు.ఆరు అంతస్తుల నుండి దిగలేక ప్రశాంత్ కింద పడి మరణించినట్లుగా తెలుస్తోంది.
ఈయనది గుంటూరు జిల్లా తాడేపల్లి గూడెం.పోలీసులు పంచనామా కార్యక్రమాలు పూర్తి చేసి బాడీని స్వస్థలంకు పంపించారు.
అక్రమ సంబంధంతో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ప్రశాంత్ మృతి చెందాడు.ఇలాంటి వ్యవహరాలు ఎప్పటికి అయినా ప్రమాదాన్ని కొని తెస్తాయి అనేందుకు ఇదే నిదర్శణం.