తెలుగులో ఒకప్పుడు దాదాపుగా అందరి హీరోల సరసన నటించినటువంటి హీరోయిన్ స్నేహ గురించి పెద్దగా తెలియని వారుండరు.అయితే ఇటీవల కాలంలో తమిళ నటుడు ప్రసన్న వివాహం చేసుకోవడంతో అప్పుడప్పుడూ అడపాదడపా తెలుగు సినిమాల్లో నటిస్తోంది స్నేహ.
అంతేగాక ఈ మధ్యనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది స్నేహ.అయితే తాజాగా స్నేహ భర్త ప్రసన్న మరో హీరోయిన్ పై చేసినటువంటి కామెంట్లు నెట్లో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ విషయం ఏంటంటే హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ “నాంది” అనే చిత్రంలో అల్లరి నరేష్ సరసన నటిస్తోంది.అయితే ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించినటువంటి ఓ ఫోటోని తన అభిమానులతో తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది.
అంతేగాక ఈ ఫోటోకి అప్పట్లో ఇలా సిగ్గుపడుతూ ఉండేదాన్ని క్యాప్షన్ ఇచ్చింది.దీంతో నెటిజన్లు ఆమె ట్రెడిషనల్ లుక్ కి ఫిదా అయ్యారు.అయితే మెదడు ప్రసన్న మాత్రం “సిగ్గు పడుతున్నావా…?, నీకు సిగ్గు కూడా ఉందా…?” అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.అయితే దీనికి వరలక్ష్మి స్పందిస్తూ అందుకే కదా “అప్పట్లో” అని మెన్షన్ చేశానని మరింత ఫన్నీ గా రిప్లై ఇచ్చింది.
అయితే వీరిద్దరూ గతంలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించినటువంటి కురుక్షేత్రం అనే చిత్రంలో నటించారు.అయితే ఆన్ స్క్రీన్ లోనే కాకుండా నిజజీవితంలో కూడా ప్రసన్న మరియు వరలక్ష్మి లు మంచి స్నేహితులు.ఆ చనువుతో ప్రసన్న వరలక్ష్మి పై ఇలాంటి కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.