ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడెక్కుతుంది.ఎన్నికల తేదీ దగ్గర పడటంతో మా ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న టువంటి నటుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ చురుగ్గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా తన ప్యానల్ సభ్యులతో సమావేశమై ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయం గురించి చర్చించారు.ఈ క్రమంలోనే ఎన్నికలలో తన ప్యానెల్ గెలిస్తే మా సభ్యుల కోసం రూ.10 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తానని ప్రకాష్ రాజ్ తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.అసోసియేషన్ లో చాలా మంది సభ్యులు క్రియాశీలకంగా లేరని,కొంతమంది హీరోలు మా సభ్యులుగా ఉన్నప్పటికీ మా ఎన్నికలలో తమ ఓటును వినియోగించుకోవడం కోసం రావడంలేదంటూ ప్రకాష్ రాజ్ తెలియజేశారు.
తను ఎన్నికలలో గెలిస్తే కేవలం ఆరు నెలల వ్యవధి కాలంలోని అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న మా అసోసియేషన్ మసకబారడానికి, ఇలా తయారవ్వడానికి కొందరు మాత్రమే కారణం అంటూ ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటివరకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ కి తన పూర్తి మద్దతు తెలిపిన బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ లోకి జీవిత రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వడంతో అతను బయటకు వచ్చి జీవిత రాజశేఖర్ పై పోటీకి సిద్దం అయిన సంగతి మనకు తెలిసిందే.