ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి బీజేపీపై విమర్శనాశ్రాలు సంధించాడు.మోడీపై మరియు బీజేపీ నాయకులపై ప్రకాష్ రాజ్ ఎప్పుడు ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటాడు.
తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించాడు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అధికారంను అడ్డు పెట్టుకుని ఢిల్లీలో వారు చేస్తున్న అరాచకాలు ఇకపై అయినా ఆపితే బాగుంటుందని ప్రకాష్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గోలి, బిర్యానీ, టెర్రరిజం, రెచ్చగొట్టే స్పీచ్లతోనే ప్రచారంను నిర్వహిస్తున్నారు.
ఇలా చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం గట్టడం ఖాయం అని, బీజేపీ వారు చేస్తున్న దారుణాలను ప్రజలంతా చూస్తున్నారంటూ ఆప్ పార్టీ నాయకులు అంటున్నారు.
కేజ్రీవాల్పై బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు తారా స్థాయికి చేరడంతో ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.