తమిళ స్టార్ నటుడు ప్రభు కరోనా బారిన పడ్డట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.ఆయన హాస్పిటల్లో ఐసోలేషన్ లో ఉన్నట్లుగా మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి.
ఉన్నట్లుండి ఆ వార్తలు రావడానికి కారణం కూడా ఉంది.అదేంటి అంటే అక్టోబర్ ఒకటో తేదీన ఆయన తండ్రి శివాజీ గణేషన్ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొనలేదు.
ప్రభు నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొనకపోవడం పై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.ఆ సమయంలోనే కొందరు ప్రభుకి కరోనా పాజిటివ్ అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
దాంతో తమిళ మీడియా మరియు జాతీయ మీడియాలో కూడా ప్రభు కరోనా బారిన పడ్డాడు అన్న వార్తలు ప్రముఖంగా వచ్చాయి.మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు వార్తల్లో నిజం లేదని పేర్కొన్నాడు హాస్పటల్లో ఉన్న కారణంగా నాన్న గారి కార్యక్రమానికి హాజరు కాలేక పోయాను అంటూ ప్రభు వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం ఆయన తెలుగు తమిళం లో కలిపి ఐదు సినిమాల్లో నటిస్తున్నారు.తెలుగులో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.ప్రభాస్ డార్లింగ్ సినిమాలో నటించి అందరి మన్ననలు పొందారు.ఆయన నటించిన తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి సక్సెస్ అయ్యాయి.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆయన మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.అలాంటి ప్రభు కరోనా బారిన పడటంతో అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఆయన ఆ వార్తలను ఖండించగా అంతా ఊపిరి పీల్చుకున్నారు.తమిళంకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఇప్పటికే కరోనా బారిన పడ్డ కారణంగా ప్రభు కరోనా వార్తలను అంతా కూడా నిజమే అనుకున్నారు.
తాజాగా ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా లేదంటూ క్లారిటీ వచ్చింది.