ఎక్కువగా సీరియల్స్ సంవత్సరాల త్వరపడి రన్ అవుతూ ఉన్నప్పుడు మెయిన్ లీడ్ లో చేసే నటులు మారిపోతూ ఉంటారు.అవసరాన్ని బట్టి ఒక నటుడు లేదా నటి చేసే పాత్రలో వేరొకరిని తీసుకోవడం జరుగుతుంది.
అయితే సినిమాలలో ఇప్పడు వరకు అలా ఒకరు చేసిన పాత్రలో మరొకరు ఒకే సినిమాలో చేయడం అనేది జరగలేదు.ఒక వేళ ఎవరైనా నటుడు సినిమా షూటింగ్ మధ్యలో అర్ధాంతరంగా చనిపోతే ఆ పాత్రని వేరొక నటుడితో రీప్లేస్ చేసి అప్పటికే చనిపోయిన నటుడుతో చేసిన సన్నివేశాలని రీషూట్ చేస్తారు.
చాలా వరకు సినిమాలలో ఇలాగే జరుగుతుంది.అయితే ఇప్పుడు ఒక బాలీవుడ్ సినిమాలో మాత్రం ఒకే పాత్రలో ఒకే సినిమాలో ఇద్దరు నటులు కనిపించబోతున్నారు.
గత ఏడాది బాలీవుడ్ లో షర్మాజీ నామ్ కీన్ అనే సినిమాలో రిషి కపూర్ ఓ కీలక పాత్రలో నటించారు.అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో ఆయన చనిపోయారు.
అప్పటికే సినిమాలో సగం సన్నివేశాలు ఆయన మీద షూట్ చేశారు.అయితే అవన్నీ మళ్ళీ రీషూట్ చేయడం అంటే బడ్జెట్ పెరిగిపోతుందని భావించిన చిత్ర యూనిట్ ప్రత్యామ్నాయం ఆలోచించి రిషి కపూర్ పాత్ర కనిపించే మిగిలిన సన్నివేశాల కోసం పరేష్ రావల్ ని తీసుకున్నారు.
ఇక త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.ఇలా చేయడం ద్వారా రిషి కపూర్ ని గౌరవించినట్లు ఉంటుంది.అలాగే ఒకే సినిమాలో ఒకే పాత్రలో ఇద్దరు నటులు కనిపించే మొదటి ఇండియన్ మూవీ అనే ఒక బ్రాండ్ కూడా ఉంటుందని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 4న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఈ నేపధ్యంలో సినిమాలో కొంత సమయం రిషి కపూర్, కొంత సమయం పరేష్ రావల్ ఒకే పాత్రలో కనిపిస్తారని క్లారిటీ కూడా వచ్చేసింది.మరి విధంగా ప్రయోగాత్మకంగా రాబోతున్న సినిమాలో ఆ పాత్రని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది చూడాలి.