ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం సాయి తేజ్కు అపోలో ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.అయితే, తమ హీరో త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలోనూ… ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగవాలంటూ పోస్టులు పెడుతున్నారు.సాయి తేజ్ ప్రమాదంపై ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు సైతం స్పందించి ….
మళ్ళీ మామూలు స్థితికి రావాలంటూ ఆవేధన వ్యక్తం చేశారు.
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య స్థితిపై పలువురు సెలబ్రిటీలు తమ శైలిలో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
శ్రీకాంత్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, బండ్ల గణేష్, నరేష్ లాంటి చాలా మంది సినీ ప్రముఖులు స్పందించారు.ఇదిలా ఉండగా… నటుడు నరేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ అయ్యాయి.
‘తమ అబ్బాయి నవీన్కి తేజ్ క్లోజ్ఫ్రెండ్.ప్రమాదం జరగడానికి ముందు తమ ఇంటి నుంచే ఇద్దరూ కలిసి బయలుదేరారని నరేష్ అన్నారు.
బైక్ పై వెళ్ళొద్దని చెప్పేలోపే సాయి తేజ్ వెళ్లిపోయాడని.ఆయన తెలిపారు.
పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాల్సిన సమయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు.వాళ్లిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలనుకున్నా ఈలోపే ప్రమాదం జరగడం బాధాకరమని ఆయన సాయి తేజ్ ప్రమాదంపై కామెంట్స్ చేశారు.
అదే విధంగా ఇలాంటి ప్రమాదాలు లో ఎంతో మంది మరణించారని నరేష్ తెలియజేశారు.ఇక ఈ కామెంట్స్ ….
పలువురి విమర్శలకు దారి తీశాయి.
నరేష్ అన్న వ్యాఖ్యలకు స్పందించిన శ్రీకాంత్, బండ్ల గణేష్… ఈ సమయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై ఓ చిన్న యుద్ధమే జరిగినట్టైంది.అందుకు బదులుగా నటుడు నరేష్ రియాక్ట్ అయ్యి తన ఉద్దేశాన్ని తెలియజేశారు.
‘‘శ్రీకాంత్.నా వ్యాఖ్యలపై చేసిన నీ బైట్ చూశాను.
అలా ఇచ్చావేంటమ్మా… ఖచ్చితంగా సాయి ధరమ్ తేజ్. స్పీడ్లో లేడు.
బురదలో జారీ పడ్డాడు.నేను చెప్పిన మాటలు.
మీడియాలో కాస్త వేరుగా వచ్చాయి.బైట్ ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి.
ఇక్కడ ఎమోషన్స్ చాలా ముఖ్యం.చనిపోయినవారి గురించి నేను చెప్పలేదు.
జనరల్గా ఇండస్ట్రీలో జరిగినవి చెప్పాను.బైకులను మనం చాక్లెట్స్ మాదిరిగా పిల్లలకు ఇవ్వం.
యాక్సిడెంట్స్ నాకు జరిగాయి.చాలా మందికి జరిగాయి.
కానీ నువ్వు మాట్లాడిన విధానం బాధకలిగింది’’ అని నరేష్ రీకౌంటర్ ఇచ్చారు.
శ్రీకాంత్ పై ఫైర్ అయిన నరేష్… మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని.తాను సాయి ధరమ్ తేజ్ గురించి తప్పుగా మాట్లాడలేదని.పిల్లల్ని అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉంటుందని మాత్రమే చెప్పానన్నారు.
శ్రీకాంత్ ఇండస్ట్రీకి రావడం, హీరోగా ఎదగడం అన్నీ తాను చూశానని.తను కూడా 50 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్ననాయని ఆయన అన్నారు.
ఏదేమైనా శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలతో తను హర్ట్ అయ్యానని నరేశ్ ఆవేధన వ్యక్తం చేశారు.